బడుల్లో నీతి.. నిజాయతీలు ఏవీ!
విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సామాజిక, మానసిక, వ్యక్తిగత విలువలతో కూడిన బోధన సాగాలనేది అందరి ఆశయం.
అటకెక్కిన కార్యక్రమాల అమలు
పర్యవేక్షణ విస్మరించిన అధికారులు
అరివేముల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు
పామూరు, సి.ఎస్.పురం- న్యూస్టుడే: విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు సామాజిక, మానసిక, వ్యక్తిగత విలువలతో కూడిన బోధన సాగాలనేది అందరి ఆశయం. ఇందుకుగాను నీతి విద్య(మోరల్ ఎడ్యుకేషన్) పేరిట వినూత్న కార్యక్రమాలను విద్యావేత్తలు రూపొందించారు. గత ప్రభుత్వం వీటిని అమలు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేసింది. ఇందులో భాగంగా నిజాయతీ, తపాలా పెట్టె, బాల సంఘాలు, స్నేహబాల, పొదుపు సంచాయక, పౌర నేస్తం, సామాజిక సేవ తదితర విద్యా విధానాలను పాఠశాల విద్యలో భాగం చేసింది. తద్వారా చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి కృషిచేసింది. అయితే ఆయా కార్యక్రమాల అమలు ప్రస్తుతం అటకెక్కింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, ఉపాధ్యాయులకు పలు బోధనేతర బాధ్యతలు అప్పగించడమూ ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వికసించని స్నేహబాల...
స్నేహబాల కార్యక్రమంలో భాగంగా 1, 2, 3 తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు ఆట పాటలతో బోధించాల్సి ఉంటుంది. చిన్నారులు ఆసక్తిగా వీటిని నేర్చుకునేందుకు ప్రవేశపెట్టిన ఈ ప్రక్రియ దాదాపు పాఠశాలల్లో ఇప్పుడు మరుగున పడింది.
కానరాని గోడపత్రికలు, సంఘాలు...
విద్యార్థుల్లో చిత్రలేఖనం, ఇతర నైపుణ్యాలను వెలికి తీయడానికి గోడ పత్రిక కార్యక్రమాన్ని అమలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో ఈ విధానం అమలు కావడంలేదు. నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి దోహదపడే బాలల సంఘాలు కూడా కనిపించడం లేదు. బాలల హక్కులు, పత్రికల నుంచి సమాచార సేకరణ, పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాల అమలు అటకెక్కింది.
* పొదుపు ఆవశ్యకతను వివరించి ఆ దిశగా చిన్నారులను ప్రోత్సహించడానికి పొదుపు సంచాయక పథకం అమలు చేయాల్సి ఉంది. ఒక ఉపాధ్యాయుడు ఈ బాధ్యత తీసుకునేవారు. విద్యార్థులు పొదుపు చేసిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఒక పుస్తకంలో నమోదు చేసి ప్రధానోపాధ్యాయుడి పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి అందులో జమ చేసేవారు. ప్రారంభంలో విద్యార్థులకు బాగా చేరువైన ఈ కార్యక్రమం.. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో అమలుకు నోచుకోవడం లేదు.
తపాలా పెట్టె జాడేది...
* రోజూ తరగతి గదిలో చోటుచేసుకున్న ఘటనలు, ఉపాధ్యాయుల బోధనా తీరు.. మధ్యాహ్న భోజన పరిస్థితి.. వింతలు, విశేషాలపై విద్యార్థులు ఉత్తరాలు రాసి వాటిని తపాలా పెట్టెలో వేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఊసూ ఇప్పుడు లేదు. ఫలితంగా ఉత్తరాలు రాసే నైపుణ్యం విద్యార్థుల్లో సన్నగిల్లుతోంది.
* విద్యార్థుల్లో నిజాయతీని పెంపొందించేందుకు గాను పాఠశాలలో దొరికిన వస్తువులను పెట్టెల్లో వేసేలా ప్రోత్సహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు అటువంటి పెట్టెల జాడే లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రేపటి పౌరుల్లో నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలు అమలయ్యేలా చూడాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం