మా సమస్యలు ప్రభుత్వానికి కనిపించవా?
దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్-హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద సోమవారం మహా ధర్నా చేపట్టారు.
కలెక్టరేట్ వద్ద కదం తొక్కిన అంగన్వాడీలు
మహాధర్నాలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్-హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద సోమవారం మహా ధర్నా చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, ఆయాలు ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. కనీస వేతనాలు చెల్లించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ ఇవ్వాలని, ముఖ ఆధారిత యాప్ రద్దు చేయాలని, కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని నినదించారు. టీఏ, డీఏలు గత అయిదేళ్లుగా చెల్లించడం లేదని, వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలుకు కొన్ని ప్రాజెక్ట్ల్లో గత 6 నెలల నుంచి బిల్లులు చెల్లించలేదన్నారు. ఇచ్చిన చరవాణులు పని చేయకపోగా, రకరకాల యాప్లు తీసుకొచ్చి పనిభారం పెంచారన్నారు. ఆహార కమిషన్, మండల అధికారులు, రాజకీయ నాయకులు తనిఖీల పేర్లతో కార్యకర్తలను అవమానిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ దినేష్కుమార్కు అందజేశారు. డీఆర్వో ఓబులేసు ధర్నా వద్దకు వచ్చి కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు రెండో పట్టణ సీఐ రాఘవరావు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజకీయ వేధింపులు ఆపాలి
అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. కార్యకర్తలు, ఆయాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సూపర్ వైజర్ పోస్టులకు వయో పరిమితిని తొలగించాలి.
పి.కల్పన, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్
టీఏ, డీఏలు ఇవ్వలేదు
గత అయిదేళ్లుగా అంగన్వాడీలకు టీఏ, డీఏలు ఇవ్వలేదు. 300 జనాభా దాటిన మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలి. కార్యకర్తలతో సమానంగా వేతనాలు ఇవ్వడంతోపాటు, అదనంగా ఆయాలను నియమించాలి. సంక్షేమ పథకాలను అమలు చేయాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి. సర్వీసులో ఉండి, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉదోగ్యం ఇవ్వాలి.
ఈదర అన్నపూర్ణ, ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్-హెల్పర్స్ యూనియన్
1.75 పైసలతో భోజనమా?
కూరలు, గ్యాస్ సిలిండర్ ఇతరత్రా అన్ని ఖర్చులు కలిపి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు రోజుకు రూ.1.75 చొప్పున ఇస్తే ఆ నగదుతో వారికి భోజనం ఎలా పెట్టాలి. కచ్చితమైన మెనూ పాటించడం సాధ్యమేనా? ఛార్జీలు పెంచాలి. గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలి. 2017 నుంచి పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. రకరకాల యాప్లతో వంద పనులు చెబుతున్నారు. పనిభారంతో ఇబ్బందులు పెడుతున్నారు.
షేక్ ముంతాజ్, కార్యకర్త, పెద్దదోర్నాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.