రుణాల సొమ్ము స్వాహా
స్వయం ఉపాధి నిమిత్తం డ్వాక్రా గ్రూపు మహిళలు తీసుకున్న రుణ నగదును తిరిగి చెల్లించినప్పటికీ బ్యాంకులో జమ చేయకుండా సమాఖ్య అధ్యక్షురాలు చేతివాటం చూపడంతో వారంతా ఆందోళన వ్యక్తంచేశారు.
కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదుచేసిన మహిళలు
జేసీ అభిషిక్త్ కిషోర్కు సమస్యను వివరిస్తున్న మహిళలు
టంగుటూరు, న్యూస్టుడే: స్వయం ఉపాధి నిమిత్తం డ్వాక్రా గ్రూపు మహిళలు తీసుకున్న రుణ నగదును తిరిగి చెల్లించినప్పటికీ బ్యాంకులో జమ చేయకుండా సమాఖ్య అధ్యక్షురాలు చేతివాటం చూపడంతో వారంతా ఆందోళన వ్యక్తంచేశారు. సోమవారం దాదాపు 60 మంది గ్రామం నుంచి ట్రాక్టర్లలో తరలివచ్చి మరీ కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనలో జేసీ అభిషిక్త్ కిషోర్కు ఫిర్యాదుచేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు 2014లో టంగుటూరు మండలం ఆలకూరపాడు క్లస్టర్ 1కు గ్రామ సంఘ అధ్యక్షురాలిగా అరుణ, సీసీగా గోవిందమ్మలు విధులు నిర్వహించారు. వీరి పరిధిలో 20 గ్రూపులు, 200 మంది మహిళా సభ్యులు ఉన్నారు. అదే ఏడాది డిసెంబర్లో ఎస్సీ, ఎస్టీల ఉన్నతికి వడ్డీ లేని రుణాలు, హెచ్డీ, వీఆర్ఎఫ్, ఇతర గ్రూపుల కింద సుమారు రూ.15 లక్షల నగదును సభ్యులకు అందించారు. 2015 సంవత్సరం ప్రారంభం నుంచే వారు తిరిగి చెల్లింపులు ప్రారంభించారు. బ్యాంకుకు జమ చేయమని చెప్పి అరుణకు ప్రతీ నెల రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు అందించారు. రెండేళ్లపాటు ఆమె బ్యాంకుకు చెల్లించలేదు. మరో విడత రుణం పొందేందుకు కొన్ని గ్రూపుల మహిళలు వెలుగు కార్యాలయం వద్దకు వెళ్లడంతో విషయం బయటపడింది. దీంతో బాధితులు న్యాయం చేయాలని కోరుతూ జేసీకి వినతిపత్రం అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు డీఆర్డీఏ పీడీ బాబురావు టంగుటూరు మండల సమాఖ్య కార్యాలయంలోని దస్త్రాలను పరిశీలించారు. మొత్తం రూ.8.83 లక్షల నిధుల స్వాహాకు సమాఖ్య అధ్యక్షురాలు అరుణ కారణమైందంటూ గుర్తించారు. ఆమెతో అక్కడి నుంచి పీడీ చరవాణి ద్వారా మాట్లాడారు. విశాఖలో ఉన్నానని, మరో రెండు రోజుల్లో వచ్చి నగదు క్లియర్ చేయనున్నట్లు సమాధానం వచ్చింది.. లేకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పీడీ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ చేతిలో జనం బికారులు
[ 05-05-2024]
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
కూటమిదే పక్కా విజయం
[ 05-05-2024]
‘సభకు వచ్చిన జనం చూపుతున్న ఉత్సాహం.. యువత, మహిళల కేరింతలు చూస్తుంటే దర్శిలో మన విజయం పక్కా అని తేలిపోయింది. ఈ సారి కచ్చితంగా తెదేపా జెండా ఎగరేస్తాం. -
పోలింగ్కు ఇదేం సన్నద్ధత!
[ 05-05-2024]
తపాలా ఓటింగ్ మొదటి రోజైన శనివారం జిల్లాలో పలు చోట్ల అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఒంగోలు డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలోని సగం కేంద్రాల్లో గెజిటెడ్ అధికారులు అందుబాటులో లేరు. -
జగన్ రాసిన మరణ శాసనం
[ 05-05-2024]
అయిదేళ్ల క్రితం వచ్చిన ఆ పాద యాత్రికుడు అక్కడి వారిపై అమృతం కురిపించారు..జీవచ్ఛవాల్లా ఉన్న కనిగిరివాసులకు ఊరడించారు..ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొడతానన్నారు. -
11న ఒంగోలుకు చంద్రబాబు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు రానున్నారు. -
తెదేపా గూటికి వైకాపా సర్పంచి
[ 05-05-2024]
పొన్నలూరు మండలంలో సైకిల్ జోరు మీదుంది. మండలంలోని కె.అగ్రహారం గ్రామ సర్పంచి షేక్ చిన్న మస్తాన్ శుక్రవారం రాత్రి దామచర్ల సత్య సమక్షంలో తెదేపాలో చేరారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
కొత్తపట్నంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం, కె.పల్లెపాలెం, ఈతముక్కలలోని పోలింగ్ కేంద్రాలను శనివారం జిల్లా పోలీసు పరిశీలకులు హసిబ్ ఉర్ రెహమాన్ పరిశీలించారు. -
చట్టం ముసుగులో దోపిడీకి జగన్ కుట్ర
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంతో పాటు జిల్లాలోని మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో రైతులకు చెందిన భూములు, పట్టా భూములను పట్టపగలే ఆక్రమణ చేసుకోని కబ్జా చేస్తున్న, చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు