జనంలోకి నాయక గణం అడుగులు...
వైకాపా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఇటీవల ప్రకటించారు.
నియోజకవర్గాల వారీగా తెదేపా ప్రణాళికలు
శ్రేణుల్లో ఉత్సాహం నింపిన వరుస విజయాలు
నిస్తేజంలో ‘అధికార’ నేతలు, కార్యకర్తలు
‘పల్లె పల్లెకు తెలుగుదేశం’ పేరుతో గ్రామాల్లో పర్యటించేందుకు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర తయారు చేయించిన ప్రచార రథం
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: వైకాపా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. దీంతో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయమే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు జనంలోకి వెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్లు కూడా మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ‘బాదుడే-బాదుడు’; ఇదేమి ఖర్మ- మన రాష్ట్రానికి’ కార్యక్రమాల ద్వారా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలుపుతున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు, నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యులు, ఇతర నాయకులు ఇందులో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను తొలగించడంపై బాధిత కుటుంబాలతో మాట్లాడి భరోసా ఇస్తున్నారు. విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, మున్సిపాలిటీల్లో చెత్త పన్ను, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలిచారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధితో పాటు, వైకాపా అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన పనుల గురించి వివరించారు. తాజాగా మరిన్ని కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అయ్యేందుకు సమాయత్తమయ్యారు.
కొనకనమిట్లలో పాదయాత్రగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి,
కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, తెదేపా శ్రేణులు
* వచ్చే నెలలో చురుగ్గా...: కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వచ్చే నెల మొదటి పక్షంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ పేరుతో నియోజకవర్గంలో పర్యటించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకుగాను గోడపత్రాలు, కరపత్రాలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
* ‘ఛాయ్ పే చర్చ’ పేరుతో ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపాలిటీలో మూడు నెలలపాటు గతంలో విస్తృతంగా పర్యటించారు. వచ్చే నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ‘పల్లె పల్లెకు తెలుగుదేశం’ పేరుతో కార్యాచరణ చేపట్టారు. ఇందుకు అవసరమైన ప్రచార రథాన్ని విజయవాడలో ప్రత్యేకంగా చేయించి తీసుకొచ్చారు. మండలాల వారీగా ప్రతి కుటుంబాన్ని కలవాలనే లక్ష్యంతో ప్రణాళిక చేస్తున్నారు.
* ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒంగోలు నగరంలోని అన్ని డివిజన్లలో వచ్చే నెల నుంచి పాదయాత్ర చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా సిద్ధమయ్యారు. వారంలో మూడు రోజులపాటు ఒంగోలు, కొత్తపట్నô మండలాల్లో పర్యటించనున్నారు.
* వచ్చే నెల మొదటి వారం నుంచి యర్రగొండపాలెం నియోజకవర్గంలో తెదేపా బాధ్యుడు గూడూరి ఎరిక్షన్బాబు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. వెలిగొండ ప్రాజెక్ట్తో పాటు, మార్కాపురం జిల్లా సాధన, తాగునీటి సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని మండలాల్లో పాదయాత్ర కొనసాగేలా త్రిపురాంతకం అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఈ దిశగా ఆయా నాయకులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
ఒంగోలులో సమస్యలు నమోదు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్(పాత చిత్రం)
శ్రీకారం చుట్టిన కందుల..
వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, మార్కాపురం జిల్లా సాధన, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కొనకనమిట్లలోని వెలిగొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేసి అడుగు ముందుకేశారు. అధికసంఖ్యలో తెదేపా శ్రేణులు తరలిరాగా.. కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైకాపాలో మార్పులపై చర్చ...
2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చూపాం. తర్వాత పంచాయతీ, పరిషత్, పురపాలక ఎన్నికల్లోనూ తిరుగులేని గెలుపులను సొంతం చేసుకున్నామంటూ వైకాపా శ్రేణులు ఇప్పటి వరకు ధీమా వ్యక్తం చేశాయి. ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి మూడు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ వ్యూహాత్మక గెలుపుతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఇందులో భాగస్వామ్యం ఉండటంతో ప్రభుత్వ పరిపాలనపై ఉన్న వ్యతిరేకత ఏమిటో స్పష్టంగా అర్థమైందంటూ వైకాపా నాయకులు, కార్యకర్తల్లో అంతర్గతంగా చర్చ సాగుతోంది. దీనికితోడు ఇటీవల జిల్లాలో సర్వే చేశారని.. మూడు, నాలుగు స్థానాల్లోని ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత దృష్ట్యా సిట్టింగ్లను మార్చే అవకాశం ఉందని ఆ పార్టీ కార్యకర్తల్లోనే విస్తృత ప్రచారం నడుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం