చర్మకారుల ఉపాధికి సున్నం
చర్మకారులకు ఉపాధి కల్పించాలనే సదాశయంతో ఏర్పాటు చేసిన లెదర్ పార్క్ అది. తొలినాళ్లలో కొందరిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో ఉన్నతాశయం నీరుగారగా.. విలువైన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది.
దశాబ్దాల క్రితం నిర్మాణం
కార్యకలాపాలు లేక నిరుపయోగం
రాచర్ల, న్యూస్టుడే:
యడవల్లి వద్ద అలంకారప్రాయంగా మిగిలిన షెడ్డు
చర్మకారులకు ఉపాధి కల్పించాలనే సదాశయంతో ఏర్పాటు చేసిన లెదర్ పార్క్ అది. తొలినాళ్లలో కొందరిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో ఉన్నతాశయం నీరుగారగా.. విలువైన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారింది. గిద్దలూరు నియోజకవర్గంలో సుమారు పది వేల వరకు చర్మకారుల కుటుంబాలున్నాయి. వీరికి వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించాలని నాటి పాలకులు సంకల్పించారు. ఇందుకుగాను రాచర్ల మండలం యడవల్ల్లి రెవెన్యూలో సర్వే నంబరు 781/2, 953లో 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిని రెండు దశాబ్దాల క్రితమే సేకరించారు. 2003లో మినీ లెదర్ పార్క్ ఏర్పాటు పనులను నాటి ప్రభుత్వం ప్రారంభించింది. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో కార్మికులకు శాశ్వత నివాస గృహాలు, వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఉపయుక్తమైన పాఠశాల, అలాగే బ్యాంకు, పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. మొదటిగా శిక్షణకు అవసరమైన ఒక షెడ్డును రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించారు. అనంతరం విద్యుత్తు లైన్లు, పరివర్తకం ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆపై ఇటుగా చూసిన అధికారులు, పాలకులు లేకపోయారు. దీంతో విద్యుత్తు తీగలు దొంగలపాలయ్యాయి. అలంకారప్రాయంగా మిగిలిన పరివర్తకాన్ని అధికారులే తొలగించారు. లెదర్ పార్క్ కోసం సేకరించిన భూముల్లో ఇతరులు సాగు చేపడుతున్నారు.
షెడ్డు మూసి వేసి.. యంత్రాలు తరలించి...: చర్మకారులకు శిక్షణ ఇచ్చేదుకు గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన 40 మందిని గతంలో ఎంపిక చేశారు. వీరికి తమిళనాడు రాష్ట్రం చెన్నైలో అధికారులు శిక్షణ ఇప్పించారు. అనంతరం వీరితో చెప్పులు, బూట్లతో పాటు ఇతర చర్మ ఆధారిత వస్తువులు తయారు చేయించాలని.. వాటికి మార్కెటింగ్ చూపి ఉపాధి కల్పించాలనే ఉద్దేశం. ఇందుకోసం కొన్ని యంత్రాలు కూడా ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన వారు గిద్దలూరులో మరికొందరికీ తర్ఫీదు ఇచ్చారు. ఇక అంతా సక్రమంగా సాగుతుంది అనుకునేంతలో షెడ్డును మూసి వేశారు. చర్మకారులకు శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంత్రాలను ఇక్కడి నుంచి విజయవాడ తరలించారు.
ఇతర ప్రాంతాలకు వలస...: లెదర్ పార్కు మూతపడటంతో శిక్షణ పొందిన చర్మకారులు చేసేందుకు పని లేకపోయింది. దీంతో జీవనోపాధి కోసం వారంతా రాడ్ బెండింగ్, బేల్దారీ, వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. వీరిలో కొందరు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, హుబ్లీ తదిరత ప్రాంతాలకు వలస వెళ్లి పొట్టపోసుకుంటున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి లెదర్ పార్క్ను తిరిగి గాడిలో పెట్టి చర్మకారులకు ఉపాధి చూపాలని పలువురు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
పేరుకే పోలీసులు..పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.