సుగంధం.. సాగు చేద్దాం...
సీఎస్ఐఆర్ అరోమా మిషన్-3.0లో భాగంగా జిల్లాలో సుగంధ పంటల సాగు ప్రోత్సాహానికి ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. నిమ్మగడ్డి, కాశగడ్డి, వట్టివేరు, కామాక్షి కసువు సాగుకు జిల్లాలో అనువైన వాతావరణం ఉందని అధికారులు గుర్తించారు.
జిల్లాలో అనుకూలమైన నేలలు
ప్రోత్సాహానికి ఉద్యాన శాఖ కార్యక్రమాలు
ఈనాడు డిజిటల్, ఒంగోలు:
కొత్తపట్నంలో వట్టివేరు పంటను పరిశీలిస్తున్న అధికారులు
సీఎస్ఐఆర్ అరోమా మిషన్-3.0లో భాగంగా జిల్లాలో సుగంధ పంటల సాగు ప్రోత్సాహానికి ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. నిమ్మగడ్డి, కాశగడ్డి, వట్టివేరు, కామాక్షి కసువు సాగుకు జిల్లాలో అనువైన వాతావరణం ఉందని అధికారులు గుర్తించారు. ఆ మేరకు రైతులను సాగుకు ప్రోత్సహించే దిశగా అవగాహన కల్పిస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఆరోమా మిషన్1, 2 కింద విరివిగా సుగంధాల సాగు చేపడుతున్నారు. మిషన్ 3లో భాగంగా దక్షిణ భారతదేశంలోని కేరళలో అత్యధికంగా, తమిళనాడు, కర్ణాటకలో ఈ తరహా పంటల సాగు చేపట్టారు. ఈ రకం పంటలు సాగవుతుండగా రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో రైతులు ముందుకొస్తున్నారు.
జిల్లాలో ఎక్కడెక్కడంటే...
జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో గడికోట, కొమరోలు, దద్దవాడ, సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి పరిధిలోని పల్లామల్లి, మార్కాపురం నియోజకవర్గంలోని రాయవరం, నాయుడుపల్లి, ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం, ఈతముక్కల ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 150 ఎకరాల్లో నిమ్మగడ్డి, కాశగడ్డి, వట్టివేరు రకం సుగంధ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. దీంతో ఈ దిశగా మరింత ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు కార్యాచరణ ప్రణాళికను అధికారులు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఒంగోలులోని ప్రకాశం భవన్లో సుగంధ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
నిమ్మగడ్డి
మనకు అనుకూలమైన రకాలు ఏవంటే...
* నిమ్మగడ్డి ద్వారా లభించే నూనెను ప్రధానంగా సబ్బులు, సువాసనలు వెదజల్లే పదార్థాల్లో వినియోగిస్తున్నారు. దీన్ని వర్షాధార, నీటిపారుదల పంటగా సాగు చేయవచ్చు. అధిక సూర్యరశ్మి, తేమతో కూడిన వాతావరణం ఉన్న ప్రాంతాలు, సారవంతమైన నేలల్లో బాగా పెరుగుతుంది. ఇసుక నేలల్లో అయితే ఎరువులు అధికంగా వినియోగించాలి. * కాశగడ్డి(పామరోజ) పంట ద్వారా వచ్చే తైలాన్ని కూడా సబ్బులు, పొగాకు, ఆహార పదార్థాల సువాసనలు పెంచేందుకు, దోమల నివారణ మందుల తయారీలో వినియోగిస్తారు. దీన్ని అన్నికరాల నేలల్లో సాగు చేయవచ్చు. * కామాక్షి కసువు(సిట్రోనెల్లా) రకం తైలాన్నీ సబ్బులు, అగర్బత్తీలు, లేపనాలు, దోమల మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఎర్రనేలల్లో ఈ పంట బాగా వస్తుంది. * వట్టివేరు సుగంధ తైలాన్ని పరిమళభరితమైన సబ్బులు, శీతల పానీయాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ గడ్డి వేర్లను బుట్టలు, చేతి సంచులు, చాపల తయారీకి కూడా వినియోగిస్తారు. ఆయా పంటల సాగుకు ఇప్పుడిప్పుడే జిల్లాలో రైతులు ఆసక్తి చూపుతున్నారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ తెలిపారు.
చీమకుర్తి మండలం పల్లామల్లిలో ఓ రైతు నుంచి వివరాలు తెలుసుకుంటున్నఅధికారులు
అనువైన నేలలు.. అధిక ఆదాయం...
జిల్లాలో సుగంధ పంటల సాగుకు అనువైన నేలలు, వాతావరణం ఉంది. ఈ పంటలపై రైతులు సాగుకు మొగ్గుచూపితే మంచి ఫలితాలు ఉంటాయి. తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేసి నాలుగైదేళ్లపాటు అధిక ఆదాయం పొందవచ్చు. ఇటీవలే సదస్సు ద్వారా సుగంధ పంటలపై రైతులకు అవగాహన కల్పించాం. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదింది మరిన్ని వివరాలు తెలసుకుని సాగుకు ఉపక్రమించవచ్చు.
దినేష్ కుమార్, కలెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM