పట్టు జారిపోతా ఉంది...
పట్టు సాగు చేసే రైతులు, దారం తీసే కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. వారికి అందించాల్సిన ప్రోత్సాహకాలు మూడేళ్లుగా అందడం లేదు.
సాగుకు కానరాని ప్రోత్సాహకాలు
మూడేళ్ల్లుగా అందని ప్రభుత్వ రాయితీలు
మూతపడుతున్న దారం తీసే కేంద్రాలు
కంభం, బేస్తవారపేట గ్రామీణం- న్యూస్టుడే: పట్టు సాగు చేసే రైతులు, దారం తీసే కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. వారికి అందించాల్సిన ప్రోత్సాహకాలు మూడేళ్లుగా అందడం లేదు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్య ధోరణితో రైతులు, కేంద్రాల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1500 ఎకరాల్లో మల్బరీ సాగులో ఉంది. ఇందులో పశ్చిమంలోని మార్కాపురం డివిజన్లోనే 1,160 ఎకరాల్లో కర్షకులు సాగు చేశారు. బేస్తవారపేట, కంభం, గిద్దలూరు, మార్కాపురం, తర్లుపాడు, త్రిపురాంతకం, యర్రగొండపాలెం తదితర మండలాల్లో ఈ తోటలు అత్యధికం. ఈ ఏడాది కొత్తగా మరో 210 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులు లక్ష్యంగానూ నిర్ణయించుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయితీలు అందకపోవడం.. ధరలు నానాటికీ దిగజారుతుండటంతో రైతులు పట్టు సాగుకు విముఖత ప్రదర్శిస్తున్నారు.
* స్థానికంగా లేని మార్కెట్...: గతంలో పండించిన పట్టుగూళ్లపై కిలోకు రూ. 50 వరకు ప్రోత్సాహంగా అందించేవారు. ప్రస్తుతం ఆ ఊసే లేకపోతోంది. గత మూడేళ్లుగా ఒక్కో రైతుకు ఏడాదికి రూ. లక్ష వరకు ప్రోత్సాహకాలు అందాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి రూ.12 కోట్ల మేర బకాయిలున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోనూ సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర బకాయిలు రావాల్సి ఉంది. గత ప్రభుత్వం రైతులకు రాయితీపై బిందుసేద్యం పరికరాలు అందజేశారు. మూడేళ్లుగా డ్రిప్ రాయితీలు నిలిపివేశారు. తిరిగి మళ్లీ ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. గతంలో షెడ్ల నిర్మాణాలకు రాయితీలు ఇచ్చారు. ఇప్పుడు వీటికి కూడా సక్రమంగా అందిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మార్కెట్లో బైవోల్టెన్ పట్టు గూళ్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో కర్షకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో పట్టుగూళ్ల మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో హిందూపురం, పలమనేరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సరైన రవాణా సౌకర్యం లేకపోవడమూ సమస్యగా మారింది.
* కూలీలకు బతుకుదెరువూ కరవు...: జిల్లాలో పట్టు దారం తీసే కేంద్రాలు మూడింటిని బేస్తవారపేటలో మొదటిసారిగా ఏర్పాటు చేశారు. కొన్నేళ్లు బాగానే నడిచాయి. కరోనా తర్వాత పట్టు గూళ్ల ధరలు పెరిగిపోవడం, దారం తీసేందుకు నిపుణులైన పనివారు లేకపోవడం, విద్యుత్తు ఛార్జీలు పెరగడం తదితర కారణాలతో అవికాస్తా మూతపడ్డాయి. కిలో పట్టు దారానికి ప్రభుత్వం రూ. 130 ప్రోత్సాహకంగా గతంలో అందించేది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి ఊసేలేదు. ఇందుకు సంబంధించి రూ. లక్షల్లో బకాయిలు అందాల్సి ఉంది. ఆయా కేంద్రాలు పనిచేస్తూ ఉంటే ఒక్కో దాంట్లో సుమారు 20 మందికి ఉపాధి లభించేది. అవి మూతపడడంతో పలువురికి బతుకుదెరువు కూడా లేకుండా పోయినట్లైంది.
ప్రభుత్వానికి నివేదించాం...
పట్టు రైతులకు రావాల్సిన ప్రోత్సాహకాలపై ఆయా మార్కెట్ల వారు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తుంటారు. వాటిని ప్రభుత్వం పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విడుదల చేస్తే రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయి. షెడ్ల రాయితీ, ఇతర బకాయిలపై ఉన్నతాధికారులకు తెలిపాం. రైతులకు కూడా ప్రోత్సాహకాలు రావాల్సి ఉన్నది వాస్తవం. అయితే వాటిపై మాకు పూర్తి సమాచారం ఉండదు.
నారాయణరెడ్డి, పట్టు పరిశ్రమ ఏడీ, మార్కాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం