తలుపు తట్టనున్న ఓటు
సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది.
ఇంటి వద్దే వినియోగానికి చోటు
విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులే అర్హులు
దరఖాస్తుకు ఏప్రిల్ 22 తుది గడువు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే
సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది. పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లలేని శారీరక విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు(85 సంవత్సరాలు పైబడినవారు) ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఇందుకుగాను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారులకు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అధికారులు స్వయంగా పరిశీలించి వాస్తవమైతే ఇంటి వద్దే ఓటు వేసేలా అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియకు జిల్లా స్థాయిలో ఒడా వైస్ ఛైర్మన్ విశ్వేశ్వరరావు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
అధికారులకు ముందుగా తెలిపితేనే...: జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే శారీరక విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల ఓటర్ల వివరాలను ఎన్నికల అధికారులు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 24,175 మంది విభిన్న ప్రతిభావంతులు, 7,784 మంది వయో వృద్ధులున్నట్లు గుర్తించారు. ఆ రెండు విభాగాల కింద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే వారిని ముందుగా పోలింగ్ బూత్ స్థాయి అధికారులు(బీఎల్వోలు) క్షేత్రస్థాయిలో గుర్తించి ఫారం-12డీ అందజేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో పూరించిన తర్వాత సదరు దరఖాస్తును తిరిగి బీఎల్వోలకు అందజేయాలి. అనంతరం వాటిని నియోజకవర్గ ఆర్వోలకు బీఎల్వోలు ఇవ్వనున్నారు. ఎవరైనా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేస్తామని చెబితే వారికి 12డీ దరఖాస్తులు ఇవ్వరు.
ఈ పత్రాలు తప్పక అవసరం...: 12డీ దరఖాస్తును బీఎల్వోకు అందజేసేందుకు ఏప్రిల్ 22వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. దీంతోపాటు, ఎపిక్ కార్డు, విభిన్న ప్రతిభావంతులైతే ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. వయో వృద్ధులైతే ఓటర్ల జాబితాలోనే వయస్సును ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇంటి దగ్గరే ఓటేసేందుకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పోస్టల్ బ్యాలెట్లను ముద్రిస్తారు.
రహస్య పద్ధతిలో ఓటింగ్...: అర్హులతో మే 4 నుంచి 10వ తేదీలోపు ఇంటి వద్దనే ఓటు వేయించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. దరఖాస్తుదారుల ఇంటికి ఎన్నికల సిబ్బంది మొబైల్ వ్యాన్లో వస్తారు. అందులో ఇద్దరు పోలింగ్ అధికారులు, ఒక వీడియోగ్రాఫర్, మరో రక్షణ అధికారి ఉంటారు. అక్కడ ఓటరుకు పోస్టల్ బ్యాలెట్ అందజేస్తారు. అధికారులు నిర్దేశించిన పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్లి రహస్యంగా ఓటు వేసి బ్యాలెట్ పెట్టెలో వేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తిగా వీడియోలో చిత్రీకరిస్తారు. ఆ సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా సమాచారం అందిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!