చిట్టి తాబేళ్లనుసంరక్షించాలని...
ఏటా జనవరి నుంచి జూన్ వరకు ఆలివ్రిడ్లేలు సముద్రంలో నుంచి వచ్చి తీరంలో గుడ్లు పెట్టేసి వెళ్లిపోతుంటాయి. అవి వాటిని పొదగలేవు. ప్రకృతి సిద్ధంగానే గుడ్ల నుంచి పిల్లలు బయటకువస్తాయి. ఇందుకు 45 నుంచి 60 రోజులు పడుతుంది.
కాశీబుగ్గ తీర ప్రాంతంలో గుడ్లు సేకరించి భద్రపరుస్తున్న సిబ్బంది
బలగ(శ్రీకాకుళం), న్యూస్టుడే: ఏటా జనవరి నుంచి జూన్ వరకు ఆలివ్రిడ్లేలు సముద్రంలో నుంచి వచ్చి తీరంలో గుడ్లు పెట్టేసి వెళ్లిపోతుంటాయి. అవి వాటిని పొదగలేవు. ప్రకృతి సిద్ధంగానే గుడ్ల నుంచి పిల్లలు బయటకువస్తాయి. ఇందుకు 45 నుంచి 60 రోజులు పడుతుంది. ఈ లోపు రక్షణలేక తాబేళ్ల సంతతి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఆలీవ్రిడ్లేల సంరక్షణకు జిల్లా అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తీర ప్రాంతాల్లో హేచరీలను నెలకొల్పుతున్నారు. ఇందుకు ట్రీ ఫౌండేషన్ సంస్థ ప్రత్యేక సాంకేతిక తోడ్పాటునందిస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి...
తాబేళ్లు అర్ధరాత్రి దాటిన తరువాత సముద్రంలో నుంచి తీరానికి వచ్చి గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. అవి వచ్చినట్లు వాటి అడుగుల ఆధారంగా సిబ్బంది గుర్తిస్తారు. ఈలోపు గద్దలు వంటి పక్షిజాతులు ఆ గుడ్లను తినేస్తుండటం... సందర్శకులు పగులకొట్టేస్తుండటంతో పిల్లలు పుట్టడం లేదు. దీన్ని నివారించేందుకు జిల్లాలో తాబేళ్ల గుడ్లు సంరక్షించి, పొదిగే కేంద్రాలు(హేచరీలు) ఏర్పాటు చేయనున్నారు. ట్రీ ఫౌండేషన్ అనే సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రేంజ్ పరిధిలో 2, టెక్కలిలో 4, కాశీబుగ్గలో 10 చొప్పున హేచరీలు ఏర్పాటు చేసి తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సుమారు 80 వేల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందుకు 30 మందిని కేటాయించారు. 5 నెలలపాటు గుడ్ల సేకరించి, సంరక్షిస్తారు. వారికి అటవీశాఖ ద్వారా వేతనాలిస్తారు. ఇప్పటికే గుడ్లు సేకరణ ప్రారంభించారు.
లక్ష్యం... రెండు లక్షలు..
ఒక్కో తాబేలు ఒకసారి 50 నుంచి 150 గుడ్లు పెడుతుంది. సంరక్షించే బృందం వేకువజామునే తీరానికి వెళ్లి గుడ్లను సేకరిస్తారు. వాటిని అక్కడే ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద అడుగు నుంచి రెండడుగులు లోతు గొయ్యి తవ్వి వాటిని అందులో వేసి మూసివేస్తారు. అవి 45 నుంచి 50 రోజుల తరువాత పిల్లలుగా మారుతాయి. వాటిని జాగ్రత్తగా వెదురుబుట్టల్లో వేసి సముద్రంలోకి విడిచిపెడతారు. ఈసారి జిల్లాలో రెండు లక్షల గుడ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అటవీశాఖ రేంజీలు: శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ
వాటి పరిధిలో ఏర్పాటు చేయనున్న హేచరీలు: 16
అందరిపైనా బాధ్యత...
అంతరించిపోతున్న తాబేళ్ల సంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. తీర ప్రాంతాలకు వచ్చే సందర్శకులు తాబేళ్ల గుడ్లు కనిపిస్తే, వాటిని పగులగొట్టకుండా వదిలేయాలి. వాటి సంరక్షణకు 16 హేచరీలు ఏర్పాటు చేయనున్నాం. ఈసారి 2 లక్షలకుపైగా గుడ్లను సేకరించాలని నిర్ణయించాం.
- పి.వి.శాస్త్రి, టెక్కలి రేంజ్ అటవీశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం