సిక్కోలు నుంచి బస్సుయాత్రకు శ్రీకారం
వైకాపా ఆధ్యర్యంలో చేపట్టనున్న సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. గురువారం నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర కొనసాగనుంది.
హాజరుకానున్న 17 మంది మంత్రులు
అరసవల్లి, న్యూస్టుడే: వైకాపా ఆధ్యర్యంలో చేపట్టనున్న సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర జిల్లా నుంచి ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. గురువారం నుంచి 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యాత్ర కొనసాగనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు కార్యక్రమంలో పాల్గొని మూడేళ్లుగా ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని ఎలా అమలు చేస్తుందో వివరించనున్నారు. పలువురు మంత్రులు బుధవారం రాత్రే జిల్లాకు చేరుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 10 నుంచి 12 వేల వరకు వైకాపా శ్రేణులు కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. బస్సుయాత్రను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లపై నాయకులతో సమీక్షించి సూచనలు చేశారు.
పాల్గొననున్న మంత్రులు వీరే.....
ధర్మాన ప్రసాదరావు(రెవెన్యూ), బొత్స సత్యనారాయణ(విద్యాశాఖ), చెల్లుబోయిన వేణుగోపాల్(బీసీ, సంక్షేమం), సీదిరి అప్పలరాజు(మత్స్య), కె.నారాయణస్వామి(ఉప ముఖ్యమంత్రి), తానేటి వనిత(హోం), అంజాద్బాషా(మైనార్టీ వెల్ఫేర్), బి.రాజన్నదొర(ఉప ముఖ్యమంత్రి), బూడి ముత్యాలనాయుడు(ఉప ముఖ్యమంత్రి), పినిపె విశ్వరూప్(రవాణా), కారుమూరి వెంకట నాగేశ్వరరావు(పౌరసరఫరాలు), జోగి రమేష్(గృహనిర్మాణ), మేరుగ నాగార్జున(సాంఘిక సంక్షేమ), గుమ్మనూరు జయరాం(కార్మిక), ఆదిమూలపు సురేష్(పురపాలక), విడదల రజిని(వైద్య,ఆరోగ్య), ఉషశ్రీచరణ్(స్త్రీ సంక్షేమం).
యాత్ర సాగుతుందిలా...
ఉదయం 8 గంటలకు అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి వస్తారు. స్వామి దర్శనం అనంతరం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఏడురోడ్ల కూడలిలోని వైఎస్సార్ విగ్రహానికి మంత్రులు పూలమాలలు వేస్తారు. 10 గంటలకు బస్సుయాత్రను ప్రారంభిస్తారు. 11 గంటలకు ఎచ్చెర్ల, 11.45 గంటలకు రణస్థలం మీదుగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
పటిష్టమైన బందోబస్తు
బస్సు యాత్ర నేపథ్యంలో పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను సిద్ధం చేసింది. దీనిపై ఎస్పీ రాధిక బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు ట్రయిల్రన్ వేశారు.
నగరానికి చేరుకున్న మంత్రులు రాజన్నదొర, ముత్యాలనాయుడు,
వనిత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!