క్లిష్టమైనా ఉచితమే..
ప్రభుత్వ ఆసుపత్రి అంటే వెనకడుగు వేయాల్సిన పన్లేలేదని... అక్కడ కూడా అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్యసేవలందిస్తామని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులు. ఎముకల విభాగం ఆధ్వర్యంలో అతి క్లిష్టమైన శస్త్రచికిత్సలను ఉచితంగా, విజయవంతంగా చేస్తున్నారు. ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసే బదులు ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు.
సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు
- న్యూస్టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)
శస్త్ర చికిత్స చేయడంలో నిమగ్నమైన వైద్య బృందం
ప్రభుత్వ ఆసుపత్రి అంటే వెనకడుగు వేయాల్సిన పన్లేలేదని... అక్కడ కూడా అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్యసేవలందిస్తామని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యులు. ఎముకల విభాగం ఆధ్వర్యంలో అతి క్లిష్టమైన శస్త్రచికిత్సలను ఉచితంగా, విజయవంతంగా చేస్తున్నారు. ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసే బదులు ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు.
ఆసుపత్రిలో ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ కింద వెన్నుముక, డిస్క్ శస్త్రచికిత్స, మోకాలిచిప్ప మార్పిడి వంటివి చేసి రోగుల కళ్లల్లో ఆనందం నింపారు. క్రీడాకారులు ఎక్కువగా బాధపడే లిగ్మెంట్ ఇంజ్యూరీస్, మోకాలి నొప్పులు సరిచేసి తిరిగి ఆడుకునేలా చేస్తున్నారు. ఎముకల విభాగాధిపతి డాక్టర్ ధర్మారావు, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్ నేతృత్వంలోని బృందం, సిబ్బంది కలసికట్టుగా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. త్వరలో అత్యంత క్లిష్టమైన భుజం, మోచేతుల ఆపరేషన్లు సైతం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
* పలాస మండలం గారబంద గ్రామానికి చెందిన బి.కాంతారావు(32) కొంతకాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించగా హిప్జాయింట్ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. కానీ దానికి ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో పరికరాలు కొనుగోలు చేసుకుంటే ఉచితంగా ఆపరేషన్ చేస్తామని సూచించారు. బాధితులు ఆ మేరకు ఒప్పుకోవడంతో జులై 21న విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
‘ఆరోగ్యశ్రీ’లో లేకున్నా...
క్లిష్టమైన శస్త్రచికిత్సలో కొన్ని ‘ఆరోగ్యశ్రీ’ జాబితాలో లేకపోయినప్పటికీ చేసేందుకు చొరవ చూపుతున్నారు. ఆసుపత్రిలో అధునాతన శస్త్రచికిత్స థియేటర్లు, వైద్యపరికరాలు, ఎంఆర్ఐ స్కాన్, సి.టి.స్కాన్, ఆల్ట్రాసౌండ్, మొబైల్ ఎక్స్రే యూనిట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ పరిధిలో లేని కొన్ని ఆపరేషన్లు చేసేందుకు అవసరమయ్యే ప్లేట్లు, రాడ్లు, స్క్రూలు వంటి సామగ్రి ఉండవు. వాటిని రోగి బంధువులు కొనుగోలు చేసుకుంటే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.లక్షల వ్యయంతో చేసే శస్త్రచికిత్స ఇక్కడ పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఇటీవల ఆరోగ్యశ్రీ జాబితాలో లేని హిప్జాయింట్ మార్పిడి ఒకరికి ఉచితంగా చేసి సురక్షితంగా ఇంటికి పంపారు.
అధునాతన సేవలు..
సర్వజన ఆసుపత్రిలోని ఎముకల విభాగంలో నిపుణులైన వైద్యులున్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతం చేయగల సామర్థ్యం ఉంది. దానికి తోడుగా ఆసుపత్రిలో అధునాతమైన వైద్య పరికరాలు ఉన్నాయి. బాధితులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే సంబంధిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ జాబితాలో ఉందా లేదా పరిశీలించి, ఉన్నట్లయితే పూర్తి ఉచితంగా చేస్తాం. లేనిపక్షంలో సంబంధిత పరికరాలు కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటే ఉచితంగా పంపిస్తాం.
- డాక్టర్ ధర్మారావు, ఎముకల విభాగాధిపతి, సర్వజన ఆసుపత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?