logo

కిడ్నాప్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన వైద్యుడు గూడేన సోమేశ్వరరావు కిడ్నాప్‌ యత్నం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఏ విధంగా విచారణ జరిపినా పోలీసుల అదుపులో ఉన్న పరమేశ్‌ నోరు విప్పడం లేదు

Published : 12 Aug 2022 05:04 IST

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన వైద్యుడు గూడేన సోమేశ్వరరావు కిడ్నాప్‌ యత్నం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఏ విధంగా విచారణ జరిపినా పోలీసుల అదుపులో ఉన్న పరమేశ్‌ నోరు విప్పడం లేదు. మరోవైపు విశాఖపట్నం వెళ్లిన పోలీసులకు రాజు ఆచూకీ లభ్యం కాలేదు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా వినియోగిస్తున్నప్పటికీ ఫలితం లభించట్లేదు. కానీ రాజు కుటుంబసభ్యులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారిని చాలా కాలంగా రాజు ఇంటికి వెళ్లడం లేదని,  అప్పుల పాలై ప్రస్తుతం శ్రీకాకుళంలోనే ఉంటున్నట్లు తెలిసింది. అయితే సోమేశ్వరరావును కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులు ఎవరి వద్ద సుపారీ తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది.
భూ తగాదాలే కారణమా ?
వైద్యుడు సోమేశ్వరరావుకు మందసకు చెందిన కొంతమంది వ్యక్తులతో భూ తగాదాలు ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో వారెవరైనా కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించారా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. సోమేశ్వరరావును కిడ్నాప్‌ చేసి భూ పత్రాలపై సంతకాలు చేయించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజు, పరమేశ్‌పై గతంలో పాత కేసులు ఏమైనా ఉన్నాయా.. లేదా అనేదీ ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా రాజు దొరికితే గానీ అసలు విషయం బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని