logo

Andhra News: నీ వెంటే నేనంటూ.. 24 గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతి

భర్త మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. 24 గంటలైనా గడవకముందే కట్టుకున్నవాడిని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. బంధువుల కథనం ప్రకారం..

Updated : 30 Aug 2022 07:54 IST


సుందరరావు దంపతులు

సోంపేట, న్యూస్‌టుడే: భర్త మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. 24 గంటలైనా గడవకముందే కట్టుకున్నవాడిని వెతుక్కుంటూ వెళ్లిపోయింది. బంధువుల కథనం ప్రకారం.. సిరిమామిడి పంచాయితీ తోటూరు గ్రామానికి చెందిన భర్తు సుందరరావు(55) భార్యతో కలసి ఉపాధి రీత్యా బిలాయ్‌లో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం అనారోగ్యంతో ఆయన మృతిచెందారు. ఆ దిగులుతో భార్య పుణ్యవతి(48) సోమవారం మధ్యాహ్నం మృతిచెందింది. భార్యాభర్తల మృతితో విషాదం నెలకొంది. వీరికి ఇద్దరు కుమారులు.

పెద్ద కుమారుడికి వివాహం కాగా చిన్న కుమారుడికి ఈ నెల 20న పెళ్లి చేయాలని నిర్ణయించారు. అనివార్య కారణాలతో పెళ్లి వాయిదా వేశారు. సుందరరావు వాడబలిజ సంక్షేమసంఘం జాతీయ సంఘ వ్యవస్థాపక సభ్యునిగా, తోటూరు అరుణోదయ సంఘం అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. బిలాయ్‌ కుర్సీపార్‌ ఇందిరాగాంధీ విద్యాలయం ఉపాధ్యాయునిగా తెలుగు చదువులకు సేవలందిస్తూ బిలాయ్‌ ఆంధ్రుల ఐకమత్యానికి కృషి చేశారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్‌తో పాటు ఎర్రముక్కాం, తోటూరు గ్రామప్రతినిధులు, ఇతర ప్రముఖులు బిలాయ్‌ వెళ్లి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని