logo

13న తపాలా అదాలత్‌

విశాఖపట్నం తపాలా ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 13న తపాలా అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకులు నాగాదిత్యకుమార్‌ తెలిపారు.

Published : 05 Oct 2022 05:02 IST

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: విశాఖపట్నం తపాలా ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 13న తపాలా అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకులు నాగాదిత్యకుమార్‌ తెలిపారు. ఎంవీపీకాలనీ పోస్టుమాస్టర్‌ జనరల్‌ కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి జరుగుతుందన్నారు. తపాలా సర్వీసులకు సంబంధించిన ప్రత్యేక వ్యక్తిగత ఫిర్యాదులు మాత్రమే చర్చించడం జరుగుతుందన్నారు. వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఈ నెల 8లోగా ‘107వ తపాలా అదాలత్‌’ శీర్షికతో విశాక పోస్టుమాస్టర్‌ జనరల్‌ కార్యాలయానికి పంపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు