అన్ని చోట్లా.. అగచాట్లే!
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు.
కానరాని కనీస వసతులు
మూడు మండలాల్లో ‘న్యూస్టుడే’ పరిశీలన
పాలకుల నిర్లక్ష్యంపై జనం అసహనం
న్యూస్టుడే, హరిపురం (మందస), ఇచ్ఛాపురం, పలాస
ఇచ్ఛాపురం: నివాసాల నడుమ మురుగు తిష్ఠ
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. విప్లవాత్మకమైన మార్పు వస్తుందని ఆశించారు. కానీ ఐదేళ్ల క్రితం గ్రామాలు, కాలనీలు ఎలా ఉన్నాయో ఇప్పుడూ అలాగే కనిపిస్తున్నాయి. అన్న వస్తే ఏదో చేస్తాడని భావించిన జనానికి కోలుకులేని దెబ్బ తగిలినట్లయింది.
పురపాలిక పరిధిలో పట్టణానికి దగ్గరగా మూడో వార్డులో మూడు గ్రామాలు, ఒక కాలనీ ఉంది. పద్మనాభపురం గ్రామంలో మంచినీటి కోనేరుగా ఉండే చెరువు నేడు దుర్గంధంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో పురపాలక సంఘాల్లో చెరువులు, కోనేరు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. పుర పరిధిలో ఉన్న గిరిజన గ్రామం పెంటిభద్రకు చెప్పుకోవడానికి ఒక్క పని కూడా పాలకులు చేయలేకపోయారు. ఇక శివాజీనగర్లో రోడ్డు, కాలువలు వెతికినా కనిపించవు. జయరామచంద్రపురంలో మంచినీటికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
హరిపురం అవస్థలమయం
మందస మండలంలోని మందస తరువాత పెద్ద గ్రామం హరిపురం. ఐదు వేలకుపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో వైకాపా పాలనలో అభివృద్ధికి నోచుకోలేదు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన ఉద్దానం ప్రాజెక్టు నీరే గ్రామానికి ప్రధాన ఆధారం. ప్రస్తుతానికి అది తరచూ మరమ్మతులకు గురి కావడంతో తాగునీటి సమస్య నెలకొంది. గున్నయ్యనగర్, సాయికాలనీ, పాతరోడ్డు వీధుల్లో ప్రజలు నీటి కోసం ఆపసోపాలు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి తోడు అపరిశుభ్రత, స్నానాలకు వినియోగించే రెండు మంచినీటి కోనేర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అపరిశుభ్రంగా తయారయ్యాయి.
శూన్యం తెదేపా పాలనలో మా గ్రామంలో సౌకర్యాలు కల్పించారు. ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యం.
పుల్లా వాసుదేవరావు, హరిపురం
ఎటు చూసినా సమస్యలే
పలాస: పద్మనాభ గ్రామంలో నిరుపయోగంగా మారిన కోనేరు
ఇచ్ఛాపురంలోని 5వ వార్డులో తాగునీరు, మౌలిక సదుపాయాలు, వీధి దీపాలు, కాలువలు, కల్వర్టులు, అభివృద్ధికి నోచుకోని చెరువులు ఉన్నాయి. ఈ వార్డులో అత్యధికులు తెదేపా అభిమానులు కావడంతో ప్రభ్తుత్వం నిర్లక్ష్యం వహించిందని వీధి యువత తెలిపారు. ఇక్కడ 80 శాతం మంది చేపల పెంపకం, వేట, అమ్మకంతో జీవనం సాగిస్తున్నారు. 8 వీధుల్లో ఎక్కడ చూసినా కాలువలు, రోడ్లు అంసపూర్తిగానే ఉన్నాయి. యువత ఏర్పాటుచేసుకున్న గ్రంథాలయానికి తెదేపా హయాంలో భవనం నిర్మించగా, దాని నిర్వహణ పాలకులు గాలికొదిలేశారు.
వ్యాధుల భయం.. పాలకులు తమ కష్టాలను పట్టించుకోలేదు. కాలువలు లేని వీధుల్లో దుర్గంధం.. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అనారోగ్యానికి గరవుతున్నాం.
కమలోబెహర
ఇక్కట్లు పడుతున్నాం
తాగునీటి ఇబ్బందే.. జయరామచంద్రపురంలో రెండు బోర్లలో ఒక్కటే మంచినీరు వస్తోంది. ఈ బోరు సైతం ఇటీవల నెలరోజులుగా సక్రమంగా పనిచేయకపోవటంతో ఇబ్బంది పడుతున్నాం. అధికారులు పట్టించుకోలేదు. చందాలు వేసుకుని మరమ్మతులు చేసుకుంటాం.
పాపమ్మ, జయరామచంద్రపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండుటాకుల ప్రాణాలతో జగన్నాటకం..!
[ 04-05-2024]
ప్రభుత్వం ఆడిన జగన్నాటానికి పండుటాకులు నరకం చూస్తున్నారు. పింఛను డబ్బులు చేతికి అందించే అవకాశమున్నా పట్టించుకోకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. జిల్లాలో శుక్రవారం సైతం మండుటెండలో బ్యాంకుల వద్ద వృద్ధులు పడిగాపులు కాశారు. -
9 న నరసన్నపేటలో ప్రజాగళం
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. -
ప్రశ్నించే గొంతులపై ‘రాక్షస క్రీడ’..!
[ 04-05-2024]
జగన్ పాలనలో అన్యాయంపై నోరెత్తకూడదు. నిరసన ప్రదర్శించినా, సమస్యను పరిష్కరించమని అడిగినా నేరమే. ప్రభుత్వ వ్యతిరేకతను తెలిపేందుకు ఆందోళన చేసినా వారిపై కేసులు పెట్టించారు. -
ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నాం
[ 04-05-2024]
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి తెలిపారు. కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ శుక్రవారం ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బంది ఓటు వినియోగించుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం కల్పించారు. -
సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపురకు ప్రత్యేక రైలు
[ 04-05-2024]
వేసవి రద్దీని నివారించేందుకు బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలును నడపనున్నారు. -
పరిశోధన విభాగం బలోపేతానికి చర్యలు
[ 04-05-2024]
డా.బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ అంశాలతో పాటు పరిశోధన విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె.ఆర్.రజని అన్నారు. -
బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 04-05-2024]
జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదు నుంచి 18 ఏళ్ల లోపు వయసు కలిగిన బాలలకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. -
సంక్షేమం, అభివృద్ధితో కూటమి పాలన
[ 04-05-2024]
‘వైకాపా అస్తవ్యస్త పాలనతో రాష్ట్రంలో ఉపాధి దొరక్క యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రతిఒక్కరిపై పన్నుల భారం పడింది. -
వైకాపా నుంచి తెదేపాలో చేరికలు
[ 04-05-2024]
వైకాపా నుంచి తెదేపాలోకి చేరికల జోరు కొనసాగుతోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన 150 వైకాపా కుటుంబాల వారు తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM