ఆకలి తీర్చే బ్యాంకు
నిత్యం వివిధ పనులపై దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది టెక్కలి పట్టణానికొస్తుంటారు.. కొందరు తమ పనులు త్వరగా ముగించుకోగా మరికొందరు పొద్దుపోయేవరకూ ఉండాల్సి వస్తుంది.. ఇటువంటి సమయంలో ఆకలి ఆగదు కదా.. ఎక్కడో ఒకచోట హోటల్కు వెళ్లి భోజనం చేయాలి.
అక్కడికి వెళితే కడుపునిండా భోజనం
ఆదర్శంగా నిలుస్తున్న అభయం ఆలోచన
న్యూస్టుడే, టెక్కలి పట్టణం
నిత్యం వివిధ పనులపై దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది టెక్కలి పట్టణానికొస్తుంటారు.. కొందరు తమ పనులు త్వరగా ముగించుకోగా మరికొందరు పొద్దుపోయేవరకూ ఉండాల్సి వస్తుంది.. ఇటువంటి సమయంలో ఆకలి ఆగదు కదా.. ఎక్కడో ఒకచోట హోటల్కు వెళ్లి భోజనం చేయాలి. డబ్బులుంటే ఫర్వాలేదు. లేకపోతే కడుపు మాడ్చుకోవాల్సిందే కదా.. ఇంకొందరు గుప్పెడు మెతుకుల కోసమూ ఆరాటపడుతుంటారు.. ఈ కష్టాలను గుర్తించింది ఓ సేవా సంస్థ.. అన్నిదానాల కన్నా అన్నదానం మిన్న అని భావించింది.. ఆకలి తీర్చేందుకు ‘ఫుడ్ బ్యాంక్’ అనే పేరుతో ముందుకొచ్చింది.. అందరికీ ‘అభయం’ ఇస్తూ కడుపునిండా భోజనం పెడుతోంది..
టెక్కలి పట్టణంలో సేవే లక్ష్యంగా 2017లో అభయం యువజన సేవాసంఘం ఏర్పాటైంది. ఐదేళ్లుగా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. అనారోగ్య కారణాలతో మంచం పట్టిన వారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఆర్థిక, వైద్యసాయం అందించింది. అత్యవసర వేళల్లో రోగులు ఉండే ఆసుపత్రికే నేరుగా వెళ్లి రక్తదానం చేసిన సందర్భాలూ ఉన్నాయి. చిన్నారులకు పుస్తకాలు, నిరుపేదలకు దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఇంతవరకూ రూ.13 లక్షలకు పైగా విరాళాలను సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసింది. భవిష్యత్తు అవసరాలకు మరికొంత నిధిని సైతం సమకూర్చుకోగలిగింది. ఇంతటితో ఆగిపోలేదు.. ఇంకా ఏదో చేయాలని ఆలోచన చేసింది.. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఫుడ్బ్యాంక్..
ఏం చేస్తున్నారు..
ఫుడ్ బ్యాంక్ వద్ద భోజనం కోసం వరుస..
గత ఆగస్టు 15వ తేదీన టెక్కలి అంబేడ్కర్ కూడలిలోని మైత్రి పోలీస్స్టేషన్ వద్ద ‘ఫుడ్బ్యాంక్’ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇందులో ఆకలితో వచ్చేవారి కోసం ఆహార పొట్లాలు ఉంచుతారు. అవసరం అనుకునేవారు వచ్చి తీసుకోవచ్చు. ఇందులో నిత్యం 40 మందికి ఆహారం సమకూర్చుతున్నారు. ఇవి పూర్తయిన తర్వాత కావాలి అని వచ్చిన అందరికీ భోజనం పెడుతున్నారు. వీరి ఆలోచనకు మెచ్చిన పట్టణ ప్రజలు సహకారం అందిస్తున్నారు. పుట్టినరోజులు, పర్వదినాల పేరుతో దాతలు ముందుకొచ్చి భోజనం అందిస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లోనూ ప్రజల ఆకలి తీర్చుతున్నారు. నిజంగా ఇది ఆదర్శమే కదూ.. పట్టణాలు, నగరాలకు నిత్యం ఎంతోమంది ఏదో పనిపై వస్తుంటారు. ఇందులో అధికశాతం మంది అర్ధాకలితో అలమటిస్తారు. ఇలాంటి ఆలోచనలను మిగిలిన చోట్లా యువతా అందిపుచ్చుకోవాలి.
ఆకలి బాధతీరుతోంది
ఎలాంటి ఆసరా లేని నిరుపేద కుటుంబం మాది. ఆకలితో ఇబ్బందులు పడిన సందర్భాలెన్నో. ఇక్కడ ఆహారం పంపిణీ ప్రారంభించాక మాలాంటివారి ఆకలి తీరుతోంది. ఈ యువకుల సంకల్పం ఎంతో గొప్పది.
- గయా మురళి, టెక్కలి
సేవా కార్యక్రమాలు విస్తరిస్తాం
మధ్నాహ్నం వేళల్లో ఎంతోమంది ఆకలితో బాధపడుతూ ఇబ్బందిపడుతున్న ఘటనలు మా దృష్టికొచ్చాయి. వారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో ఫుడ్బ్యాంకు ఏర్పాటుచేశాం. ఇప్పటికే ఏడాదికి సంబంధించిన దాతలు దొరికారు. మరింతమంది దాతలు ముందుకొస్తే మరొకటి ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం సేవాసంఘం కార్యకలాపాల కోసం స్థలాన్ని కేటాయిస్తే అక్కడ విద్యార్థులకు ఉచితంగా పోటీపరీక్షల శిక్షణ కేంద్రాన్ని నడపాలన్న ఆలోచన ఉంది.
- దేవాది శ్రీనివాసరావు, అధ్యక్షుడు, అభయం యువజన సేవాసంఘం, టెక్కలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.