logo

పండగ పూట విషాదం!

శ్రీకూర్మంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయనను కొద్ది గంటల్లోనే మృత్యువు కబళించింది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గార మండలంలో గురువారం చోటు చేసుకుంది.

Published : 31 Mar 2023 05:52 IST

రాధాకృష్ణ (పాత చిత్రం)

గార, న్యూస్‌టుడే: శ్రీకూర్మంలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయనను కొద్ది గంటల్లోనే మృత్యువు కబళించింది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గార మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకూర్మం గ్రామానికి చెందిన కోరాడ రాధాకృష్ణ(57) కిరాణా వ్యాపారం చేస్తుంటారు. గురువారం మండలంలోని తోణంగి సచివాలయంలో వీఆర్‌వోగా పనిచేస్తున్న ఆయన కుమార్తె షర్మిల, మనవడిని తీసుకుని పని మీద బయటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తూలుగు.. నిజామాబాద్‌ గ్రామాల మధ్య సీఎస్పీ రహదారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని అకస్మాత్తుగా ఢీకొన్నారు. వెంటనే ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ముగ్గురు కింద పడిపోయారు. ఘటనలో రాధాకృష్ణ తలకు బలమైన గాయం కావడం.. శిరస్త్రాణం లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన కుమార్తె, మనవడికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని