బదిలీల కోలాహలం!
జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో గురువారం బదిలీల కోలాహలం నెలకొంది. ఎంతో కాలం ఒకే చోట విధులు నిర్వర్తించిన పలువురు అధికారులకు స్థానచలనం కల్పించారు. అత్యధికంగా రెవెన్యూశాఖ భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.
జిల్లా ముఖ్య అగ్నిమాపక అధికారిగా మోహనరావు
జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో గురువారం బదిలీల కోలాహలం నెలకొంది. ఎంతో కాలం ఒకే చోట విధులు నిర్వర్తించిన పలువురు అధికారులకు స్థానచలనం కల్పించారు. అత్యధికంగా రెవెన్యూశాఖ భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇతర శాఖల్లోనూ నూతన జిల్లా అధికారులను నియమించారు.
రెవెన్యూశాఖలో 91 మందికి స్థానచలనం
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: జిల్లా రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. తహసీల్దార్ స్థాయి నుంచి గ్రామ రెవెన్యూ అధికారి వరకు 91 మందికి స్థానచలనం కల్పించారు. ఏడుగురు తహసీˆల్దార్లు, 40 మంది గ్రేడ్-1 వీఆర్వోలు, 14 మంది సీనియర్ సహాయకులు, ఆరుగురు జూనియర్ సహాయకులు, 18 మంది ఉప తహసీల్దార్లు, మరో ఆరుగురిని అంతర జిల్లాలకు బదిలీ చేస్తూ కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్, జేసీ ఎం.నవీన్ ఉత్తర్వులిచ్చారు. బదిలీ అయిన వారిలో ముగ్గురిని డెప్యూటేషన్పై నియమించారు.
పొందూరు సబ్ రిజిస్ట్రార్గా శ్రీనివాసులు
పొందూరు, న్యూస్టుడే: విశాఖపట్నంలో సబ్ రిజిస్ట్రార్గా పని చేసిన శ్రీనివాసులు పొందూరు సబ్ రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన కనకరత్నం విశాఖకు బదిలీ అయ్యారు.
శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: జిల్లా ముఖ్య అగ్నిమాపకాధికారిగా జడ్డు మోహనరావు నియమితులయ్యారు. ఈయన 1993లో విధుల్లో చేరారు. 2010 నుంచి 2013 మధ్యకాలంలో జిల్లా అదనపు అగ్నిమాపకాధికారిగా మోహనరావు శ్రీకాకుళంలోనే పని చేశారు. అనంతరం జిల్లా అగ్నిమాపకశాఖాధికారిగా ఉద్యోగోన్నతి పొంది విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఇక్కడ జిల్లా ముఖ్య అగ్నిమాపకాధికారిగా చేస్తున్న బి.వీరభద్రరావును పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రాష్ట్ర అగ్నిమాపకశాఖ శిక్షణ కేంద్రంలో అదనపు అగ్నిమాపకాధికారిగా నియమిస్తూ బదిలీ చేశారు.
ఆర్అండ్బీ ఎస్ఈగా జాన్ సుధాకర్
గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్టుడే: జిల్లాలో రహదారులు, భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్గా జాన్ సుధాకర్ను నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన విశాఖపట్నంలో ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఎస్ఈగా చేస్తున్న కె.కాంతిమతిని విశాఖపట్నానికి బదిలీ చేశారు.
దేవాదాయశాఖ ఏసీగా చంద్రశేఖర్
శ్రీకాకుళం సాంస్కృతికం న్యూస్టుడే: జిల్లా దేవాదాయశాఖలో పలువురు ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. జిల్లా సహాయ కమిషనరుగా ఎస్.చంద్రశేఖర్ని నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన అనకాపల్లి నూకాంబిక దేవాలయం ఏసీగా పని చేశారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం పర్యవేక్షకులుగా పని చేసిన కె.వెంకటేశ్వరరావును సింహాచలం దేవస్థానానికి, జూనియర్ సహాయకులు వై.శ్యామ్ను విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయానికి బదిలీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!