అనుక్షణం అదే పనిఘా
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది.
తనిఖీ కేంద్రాల వద్ద 24 గంటలు పర్యవేక్షణ
బూర్జ మండలం మదనాపురం వద్ద తనిఖీ చేస్తున్న సిబ్బంది
న్యూస్టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. అధికారులు సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సాంకేతికతను వినియోగిస్తూ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో తనిఖీ కేంద్రాల(చెక్ పోస్టుల) వద్ద ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా అనుక్షణం అన్ని అంశాలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.
జిల్లాలో అంతర్రాష్ట్ర, అంతర జిల్లా తనిఖీ కేంద్రాలు 11 ఉన్నాయి. వాటి మీదుగా అటు ఒడిశా రాష్ట్రంతో పాటు ఇటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మద్యం, డబ్బు, ఇతర తాయిలాల రవాణాకు ఎక్కువగా ఈ దారులనే వినియోగించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా కేంద్రాలపై ప్రధానంగా దృష్టి సారించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ సైతం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద రెవెన్యూ, పోలీసు అధికారులను నియమించి ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా జరుగుతున్న తనిఖీలను ఎన్నికల అధికారులు సైతం పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడా ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా ఉండేందుకు తనిఖీలను ముమ్మరం చేశారు.
ఎక్కడెక్కడంటే..
- అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలు: పురుషోత్తపురం, రేఖదేవిపురం (ఇచ్ఛాపురం), సిద్దిగాం (పలాస), వసుంధర, మాతల, అచ్యుతాపురం, గొప్పిలి (పాతపట్నం)
- అంతర జిల్లా: కందివలస గెడ్డ, ఉల్లివలస గ్రామ కూడలి (ఎచ్చెర్ల), కర్లెమ్మ గ్రామ కూడలి (పాతపట్నం), మదనాపురం కూడలి(ఆమదాలవలస)
ఆ మూడు చోట్ల అధికం..
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆరోజు నుంచి తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా మద్యం, నగదు అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకుంటున్నారు. సరైన ఆధారాలు చూపించని వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని తనిఖీ కేంద్రాల వద్ద పరిమితికి మించి తరలిస్తున్న నగదును పట్టుకున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎక్కువగా గుర్తించారు. ఆ మూడు చోట్ల ఇప్పటి వరకు రూ.8 లక్షలకు పైగా నగదు, 15 వేల లీటర్లకు పైగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ పరిస్థితి
ఇప్పటివరకు పట్టుకున్న నగదు: రూ.11.8 లక్షలు
స్వాధీనం చేసుకున్న మద్యం: 11,986 లీటర్లు (విలువ: రూ.11.28 లక్షలు)
సీజ్ చేసిన మాదక ద్రవ్యాలు: 53,110 గ్రాములు (విలువ: రూ.1.83 లక్షలు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!