logo

పేరరివాళన్‌కు కోయంబత్తూరులో స్వాగతం

రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తూ విడుదలైన పేరరివాళన్‌ కోవై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ‘తందై ద్రావిడర్‌ కళగం’ తరఫున ఘన స్వాగతం పలికి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. విడుదల నేపథ్యంలో పేరరివాళన్‌,

Updated : 22 May 2022 06:05 IST

కేక్‌ కట్‌ చేస్తున్న దృశ్యం

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తూ విడుదలైన పేరరివాళన్‌ కోవై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ‘తందై ద్రావిడర్‌ కళగం’ తరఫున ఘన స్వాగతం పలికి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. విడుదల నేపథ్యంలో పేరరివాళన్‌, అతని తల్లి అర్పుదమ్మాళ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ విడుదలకు సాయపడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా శనివారం వారు కోవై చేరుకున్నారు. గాంధీ పురంలో ఉన్న తందై పెరియార్‌ ద్రావిడర్‌ కళగం ప్రధాన కార్యదర్శి రామకృష్ణన్‌, పలు సంస్థలకు చెందిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తందైపెరియార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేరరివాళన్‌, అర్బుతమ్మాళ్‌లు కేక్‌ కట్‌ చేసి విడుదల అయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని