ఏనుగు దాడిలో అటవీశాఖ ఉద్యోగి మృతి
ఏనుగు దాడిలో అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కోయంబత్తూరు జిల్లా పశ్చిమ కనుమల దిగువన కొన్ని గిరిజన గ్రామాలున్నాయి. ఇవి కేరళ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని
మురుగన్ (పాతచిత్రం)
ప్యారిస్, న్యూస్టుడే: ఏనుగు దాడిలో అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కోయంబత్తూరు జిల్లా పశ్చిమ కనుమల దిగువన కొన్ని గిరిజన గ్రామాలున్నాయి. ఇవి కేరళ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండడంతో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సీంగప్పతి గ్రామానికి చెందిన అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి మురుగన్ శుక్రవారం ఉదయం కుట్రాలం రోడ్డులో వెళ్తుండగా ఉన్నట్టుండి పొదల్లో నుంచి వచ్చిన ఏనుగు అతనిపై దాడిచేసింది. ఘటనలో తీవ్రగాయాలైన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.
నీళ్ల బకెట్లోపడి శిశువు...
చెన్నై (క్రైం), న్యూస్టుడే: ఆటాడుకుంటూ నీళ్ల బకెట్లో పడి ఓ శిశువు మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు... చెన్నై కేకేనగం్కు చెందిన అన్సారి, జెస్సీమా దంపతులు. వీరికి ఎనిమిది నెలల శిశువు సనా జాస్మిన్ ఉంది. గురువారం సాయంత్రం తల్లి వంట గదిలో ఉండగా శిశువు వేరే గదిలో ఆటాడుకుంటోంది. తర్వాత తల్లి వచ్చి చూడగా బిడ్డ అక్కడ కనిపించలేదు. వెతుకుతుండగా మరుగుదొడ్డిలోని నీళ్ల బకెట్లో తలకిందులుగా పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
అనుమానాస్పదంగా వ్యక్తి...
ప్యారిస్, న్యూస్టుడే: అల్పాహారం తిని టీ తాగిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్పేటకు చెందిన ప్రభు (36) ఉళుందూర్ మున్సిపాలిటీలో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇతను ఓ దుకాణంలో అల్పాహారం తిని, టీ తాగాడు. రాత్రి అతనికి అకస్మాత్తుగా శ్వాస సమస్య తలెత్తింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.