logo

దివ్యాంగుల సమస్యల పరిష్కార సమావేశం

రామనాథపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం దివ్యాంగుల సమస్యల పరిష్కార సమావేశం జరిగింది.

Published : 28 Nov 2022 01:18 IST

చిన్నారికి చక్రాల కుర్చీ అందించిన దృశ్యం

సైదాపేట, న్యూస్‌టుడే: రామనాథపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం దివ్యాంగుల సమస్యల పరిష్కార సమావేశం జరిగింది. దీనికి జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ (శిక్షణ) నారాయణ శర్మ నేతృత్వం వహించారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దివ్యాంగులకు గుర్తింపు కార్డు ఇచ్చేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు జరుగుతున్నట్లు తెలిపారు. స్వయం ఉపాధి పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. జిల్లా దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారి కదిర్‌వేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు