logo

సూర్యప్రభ వాహనంపై చంద్రశేఖరుడి వైభవం

అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహా దీపోత్సవం 2వ రోజైన సోమవారం ఉదయం ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని సూర్యప్రభ వాహనంపై కనులపండువగా ఊరేగించారు.

Published : 29 Nov 2022 00:28 IST

ఊరేగుతున్న చంద్రశేఖర స్వామివారు

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మహా దీపోత్సవం 2వ రోజైన సోమవారం ఉదయం ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని సూర్యప్రభ వాహనంపై కనులపండువగా ఊరేగించారు. ముందుగా ఆలయంలో మూలవరులైన చంద్రశేఖరస్వామి, విఘ్నేశ్వరస్వామిలకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, పూజలు, దీపారాధనలు జరిగాయి. తర్వాత మూషిక వాహనంపై గణపతిని ఊరేగించారు. తర్వాత ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవం తొలిరోజైన ఆదివారం రాత్రి పంచమూర్తులైన విఘ్నేశ్వరస్వామిని మూషిక, ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని వెండి అధికార నంది, పరాశక్తి అమ్మవారిని హంస, చండికేశ్వరర్‌ను కర్ర నంది వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పంచమూర్తుల ఊరేగింపు దృశ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని