రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: ఎడప్పాడి
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు.
నామఫలకాలను ఆవిష్కరిస్తున్న పళనిస్వామి
సేలం, న్యూస్టుడే: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తెలిపారు. సేలం జిల్లా ఎడప్పాడిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే హయాంలో శాంతిభత్రలు చక్కగా నిర్వహించామని, శాంతిభద్రతల నిర్వహణలో ఉత్తమ రాష్ట్రంగా తమిళనాడు ఎంపికై అవార్డు కూడా అందుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 36 గంటల్లో 15 హత్యలు జరుగుతున్నాయన్నారు. అనంతరం ఎడప్పాడి పంచాయతీ యూనియన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ.2.46 కోట్ల వ్యయంతో చేపట్టిన 25 పథకాలకు శంకుస్థాపన చేశారు. రూ.58.70 లక్షల వ్యయంతో చేపట్టి ముగిసిన 8 పథకాలను ప్రారంభించారు. సైదాపేట, న్యూస్టుడే: డీఎంకే పాలనలో రాష్ట్రం మాదకద్రవ్యాల స్థావరంగా మారుతోందని ఓ ప్రకటనలో ఆరోపించారు. రామనాథపురం జిల్లా వేదాలై వద్ద రూ.360 కోట్ల విలువైన ద్రవ కొకైన్ పట్టుబడినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. ఈ ఘటనలో కీళక్కరై పంచాయతీ 19 వార్డు డీఎంకే కౌన్సిలర్ సర్ఫరాజ్, మాజీ కౌన్సిలర్ జయనుద్దీన్లు అరెస్టయ్యారన్నారు. దీని వెనుక పెద్ద నేతలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు ముఖ్యమంత్రి స్టాలిన్ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!