ప్రజల నమ్మకం నిలబెట్టుకునేలా నిజాయతీ పాలన
తమను నమ్మి ఓటు వేసిన ప్రజలకు మరింత అండగా నిలిచేలా నిజాయతీగా పాలన అందిస్తున్నట్లు తెన్కాశిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.
ముఖ్యమంత్రి స్టాలిన్
ప్రదర్శనలో స్టాళ్లను పరిశీలిస్తున్న స్టాలిన్
ప్యారిస్, న్యూస్టుడే: తమను నమ్మి ఓటు వేసిన ప్రజలకు మరింత అండగా నిలిచేలా నిజాయతీగా పాలన అందిస్తున్నట్లు తెన్కాశిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ఆయన సంక్షేమ సాయం అందించేందుకు తెన్కాశికి వెళ్లారు. గురువారం ఉదయం రైలు మార్గంలో వచ్చిన ఆయనకు జిల్లా కలెక్టరు, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంట మంత్రులు కేఎన్ నెహ్రూ, పెరియస్వామి, రామచంద్రన్ ఉన్నారు. ముందుగా పలు శాఖల తరఫున ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను ఆయన సందర్శించారు. అక్కడి తిరువళ్ళువర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సుమారు రూ. 22.20 కోట్లతో పూర్తయిన 57 పథకాలను ప్రారంభించారు. సుమారు రూ.34.14 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. రూ.182.56 కోట్ల సంక్షేమ సాయాన్ని 1,03,508 మంది లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఆరంభించారు. అనంతరం మాట్లాడుతూ.... వనరులు కలిగిన జిల్లా తెన్కాశి అని, సమరయోధుడు పులిదేవర్ పుట్టిన నేల అన్నారు. అధికారం చేపట్టాక ప్రజలకు చేసిన సంక్షేమ పథకాల గురించి గర్వంగా చెబుతున్నానని తెలిపారు. తెన్కాశి వినైతీర్థ నాడార్పట్టి పంచాయతీ యూనియన్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఆరాధన తనకి ఓ ఉత్తరం రాసిందన్నారు. పాఠశాలకు అదనపు భవనం కావాలని కోరిందని, ఆ మేరకు నిధి కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ప్రతిపక్ష నేత అంటున్నారని, పిల్లి కళ్లు మూసుకుని ప్రపంచం చీకటిగా ఉందని అనుకున్నట్లు ఆయన వ్యవహారం ఉందని విమర్శించారు. నమ్మి ఓటు వేసిన ప్రజలకు నిజాయతీగా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఉత్తమ రాష్ట్రంగా తమిళనాడును మార్చడమే తమ లక్ష్యం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలను చూసినా రాష్ట్ర అభివృద్ధి గురించి తెలుస్తుందని పేర్కొన్నారు.
సంక్షేమ సాయం అందిస్తున్న దృశ్యం
సీఎంగా తొలిసారి రైలెక్కిన స్టాలిన్
చెన్నై, న్యూస్టుడే: ముఖ్యమంత్రి హోదాలో స్టాలిన్ తొలిసారి రైలు ప్రయాణం చేశారు. తెన్కాశి జిల్లా ఇలత్తూర్లో గురువారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం రాత్రి ఎగ్మూరు స్టేషన్ నుంచి పొదిగై ఎక్స్ప్రెస్లో ఆయన వెళ్లారు. దీని కోసం రైలుకు ప్రత్యేక బోగీని అనుసంధానం చేశారు. ఇందులో అన్నిరకాల సదుపాయాలు ఉంటాయి.
విగ్రహావిష్కరణకు ఆహ్వానం
చెన్నై, న్యూస్టుడే: అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమ ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రి స్టాలిన్కు ఆయన క్యాంపు కార్యాలయంలో వీసీకే అధ్యక్షుడైన ఎంపీ తిరుమావళవన్ అందించారు. మదురైలో శుక్రవారం వీసీకే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!