ఉచిత ప్రయాణానికి ఆదరణ
మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద మహిళలు 258.06 కోట్ల ప్రయాణాలు చేసినట్లు మంత్రి శివశంకర్ తెలిపారు.
మంత్రి శివశంకర్
అధికారులతో సమావేశమైన మంత్రి శివశంకర్
ప్యారిస్, న్యూస్టుడే: మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద మహిళలు 258.06 కోట్ల ప్రయాణాలు చేసినట్లు మంత్రి శివశంకర్ తెలిపారు. రవాణాశాఖ మంత్రి శివశంకర్ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ పనితీరుపై సమీక్షా సమావేశం సోమవారం జరిగినట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం నగర బస్సుల్లో 7,164 సాధారణ బస్సులను మహిళల ఉచిత ప్రయాణం కోసం నడుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మహిళలు ఉచితంగా 258.06 కోట్ల ప్రయాణాలు చేశారని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి మహిళ నెలకు రూ.888 పొదుపు చేస్తున్నట్లు తాజాగా చేపట్టిన అధ్యయనంలో తెలిసిందన్నారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ట్రాన్స్జెండర్లకు విస్తరించినట్లు చెప్పారు. 2021 ముందు 409 మార్గాల్లో నిలిపేసిన 510 బస్సులను మళ్లీ నడుపుతున్నట్లు తెలిపారు. ముఖ్యమైన మార్గాల్లో 352 మంది కండక్టర్లు లేకుండా బస్సులను నడపడంతో ఆదాయం పెరిగినట్లు తెలిపారు. చెన్నై సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రవాణాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి గోపాల్, అన్ని రవాణా సంస్థల మేనేజింగ్ డైరక్టర్లు మొదలైన వారు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ ఉద్యోగంవారికి కలే!
[ 08-05-2024]
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లవుతోంది. అన్ని ప్రాంతాలకు చదువు, అభివృద్ధి చేరుతున్నాయిగానీ.. తమిళనాడులోని పళియర్ తెగ ప్రజలకు మాత్రం అవి ఇప్పటికీ కలగానే ఉన్నాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగం అంటేనే పెద్దగా అవగాహనలేదు. -
పిరందనాళ్ వళ్తుక్కళ్ ఫస్ట్లుక్ విడుదల
[ 08-05-2024]
సుశీంద్రన్ దర్శకత్వంలోని ‘వెణ్ణిలా కబడ్డీ కుళు’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు శివబాలన్ అలియాస్ అప్పుకుట్టి. -
రాష్ట్ర ప్రయోజనాలకు శ్రమిస్తా: స్టాలిన్
[ 08-05-2024]
దేశానికి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. -
ముఖ్యమంత్రితో విద్యార్థులు
[ 08-05-2024]
రాష్ట్రంలో సోమవారం విడుదలైన 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నగరానికి చెందిన ట్రాన్స్జెండర్ నివేద, నాంగునేరిలో కులవివక్షకు గురైన చిన్నదురై మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిశారు. -
దర్యాప్తునకు నటి గౌతమి హాజరు
[ 08-05-2024]
స్థల మోసం ఫిర్యాదుపై నటి గౌతమి వద్ద రామనాథపురం పోలీసులు దర్యాప్తు చేశారు. -
ఆత్మహత్యలు అడ్డుకునేందుకు ట్రాక్టర్ల అందజేత
[ 08-05-2024]
అప్పుల బాధ భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడటాన్ని అడ్డుకోవడానికే ట్రాక్టర్లు అందిస్తున్నట్లు ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. -
అర్ధరాత్రి నుంచి అమల్లోకి ఈ-పాస్ విధానం
[ 08-05-2024]
పాఠశాలలకు వేసవి సెలవులు కావడం, ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని ప్రముఖ చల్లని పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కొడైకెనాల్కు పర్యాటకులు వరుసకట్టారు. -
జయకుమార్ లేఖలో అంశాలు అవాస్తవం
[ 08-05-2024]
తిరునెల్వేలి తూర్పు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. -
పోలీసులు స్వతంత్రంగా పనిచేస్తే నిందితులను గంటలో గుర్తిస్తారు
[ 08-05-2024]
తిరునెల్వేలి కాంగ్రెస్ అధ్యక్షుడిది హత్యా లేదా ఆత్మహత్య అని ఇంకా తేలలేదని మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM