కుమార్తెను విక్రయించేందుకు తల్లిదండ్రుల యత్నం
తల్లిదండ్రులే తమ కుమార్తెను విక్రయించేందుకు యత్నించిన సంఘటన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.
రక్షించిన పోలీసులు
ఆర్కేనగర్, న్యూస్టుడే: తల్లిదండ్రులే తమ కుమార్తెను విక్రయించేందుకు యత్నించిన సంఘటన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... చెన్నై తాంబరం పడప్పైలోని కరసంగల్ గ్రామానికి చెందిన ఏడో తరగతి గిరిజన బాలిక (17)ను చదువు మానేయాలని తల్లిదండ్రులు చెప్పారు. తాను చదువుతానని, పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను కోరినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కుమార్తెను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తికి రూ.1.50 లక్షలకు విక్రయించేందుకు నిర్ణయించారు. అతనితో మాట్లాడేందుకు శుక్రవారం వెళ్తూ ఇంట్లో ఓ గదిలో బంధించారు. విషయాన్ని బాలిక సెల్ఫోన్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూంకు తెలియజేసింది. తాంబరం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి మణిమంగలం పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు, బాలల భద్రతాధికారులు బాలిక ఇంటికి వెళ్లి విచారించారు. తల్లిదండ్రులతో ఉండడం ఇష్టం లేదని తెలుసుకున్న పోలీసులు బాలికను కాంచీపురం హోంకు తరలించారు. బాలికను కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి వివరాల కోసం దర్యాప్తు జరుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
[ 07-05-2024]
కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్పేట సమీపం సిరుత్తనూర్ గ్రామానికి చెందిన గోవిందస్వామి ఏసు కుమార్తె రోస్లిన్ మేరీ (25) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. -
అమ్మాయిలు అదరగొట్టారు
[ 07-05-2024]
ప్లస్టూ పబ్లిక్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. అబ్బాయిల కన్నా ఎక్కువ ఉత్తీర్ణతశాతం సాధించారు. -
చిన్నారిపై పెంపుడు కుక్కల దాడి
[ 07-05-2024]
పార్కులో ఐదేళ్ల చిన్నారిపై రెండు పెంపుడు కుక్కలు దారుణంగా దాడిచేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. -
ఠారెత్తిస్తున్న ఎండలు!
[ 07-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు బాగా పెరిగాయి. చాలా జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలూ జారీ చేసింది. -
అంధ పాఠకులకు ప్రత్యేక యాప్
[ 07-05-2024]
సభ్యత్వం ఉన్న వారికి పుస్తకాలను అద్దెకిచ్చే పద్ధతిని ఇటీవల అన్నా సెంటినరీ గ్రంథాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ప్లస్టూ ఫలితాల విడుదల
[ 07-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులు 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 87.13 శాతం ఉత్తీర్ణత సాధించారని కమిషనర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్ వెల్లడించారు. -
చర్చనీయంగా ఏ.ఆర్.రెహమాన్ పోస్టు
[ 07-05-2024]
దివంగత హాస్యనటుడు కుమరిముత్తు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. -
వైద్య విద్యార్థుల మృతికి సీఎం సంతాపం
[ 07-05-2024]
కన్నియాకుమరి జిల్లా రాజాక్కమంగలంలోని సముద్రంలో మునిగి మృతి చెందిన వైద్య విద్యార్థుల ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విక్రవాండి ఉప ఎన్నికకు రంగం సిద్ధం!
[ 07-05-2024]
విళుపురం జిల్లా విక్రవాండి ఎమ్మెల్యే (డీఎంకే) మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. -
ఇండియా కూటమిలో డీఎంకే ఉండి ప్రయోజనమేంటి?
[ 07-05-2024]
డీఎంకే ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనమేమి లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి అన్నారు. -
జయకుమార్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
[ 07-05-2024]
తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య