కుమార్తెను విక్రయించేందుకు తల్లిదండ్రుల యత్నం
తల్లిదండ్రులే తమ కుమార్తెను విక్రయించేందుకు యత్నించిన సంఘటన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.
రక్షించిన పోలీసులు
ఆర్కేనగర్, న్యూస్టుడే: తల్లిదండ్రులే తమ కుమార్తెను విక్రయించేందుకు యత్నించిన సంఘటన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... చెన్నై తాంబరం పడప్పైలోని కరసంగల్ గ్రామానికి చెందిన ఏడో తరగతి గిరిజన బాలిక (17)ను చదువు మానేయాలని తల్లిదండ్రులు చెప్పారు. తాను చదువుతానని, పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను కోరినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కుమార్తెను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తికి రూ.1.50 లక్షలకు విక్రయించేందుకు నిర్ణయించారు. అతనితో మాట్లాడేందుకు శుక్రవారం వెళ్తూ ఇంట్లో ఓ గదిలో బంధించారు. విషయాన్ని బాలిక సెల్ఫోన్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూంకు తెలియజేసింది. తాంబరం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి మణిమంగలం పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు, బాలల భద్రతాధికారులు బాలిక ఇంటికి వెళ్లి విచారించారు. తల్లిదండ్రులతో ఉండడం ఇష్టం లేదని తెలుసుకున్న పోలీసులు బాలికను కాంచీపురం హోంకు తరలించారు. బాలికను కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి వివరాల కోసం దర్యాప్తు జరుపుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
AP IIIT Admissions 2023: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు వేళాయె
-
Ap-top-news News
Odisha Train Accident: ఏపీ ప్రయాణికులు ఎందరో?
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే.. సినీఫక్కీలో ₹50 లక్షల చోరీ!
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
Odisha Train Accident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి