బాణసంచా గోదాములో పేలుడు..ముగ్గురి దుర్మరణం
బాణసంచా గోదాములో పేలుడు సంభవించి ముగ్గురు మృతిచెందిన ఘటన సేలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... సేలం జిల్లా సర్కార్ కొల్లప్పట్టి సెంగనూర్కి చెందిన సతీష్కుమార్ (41) స్థానికంగా బాణసంచా గోదాము నిర్వహిస్తున్నాడు.
ఘటనాస్థలిలో పరిశీలిస్తున్న పోలీసులు
సేలం, న్యూస్టుడే: బాణసంచా గోదాములో పేలుడు సంభవించి ముగ్గురు మృతిచెందిన ఘటన సేలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... సేలం జిల్లా సర్కార్ కొల్లప్పట్టి సెంగనూర్కి చెందిన సతీష్కుమార్ (41) స్థానికంగా బాణసంచా గోదాము నిర్వహిస్తున్నాడు. ఇందులో పది మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అందరూ పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. ప్రమాదంలో గోదాము నేలమట్టమైంది. శిథిలాల కింద చిక్కుకుని యజమాని సతీష్కుమార్, కార్మికులు నటేశన్ (50), 40 ఏళ్ల మహిళ ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మోహన, మణిమేఘలై తదితర ఆరుగురు 50 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసు కమిషనరు విజయకుమారి, డిప్యూటీ కమిషనరు గౌతమ్ గోయల్ ఘటనాస్థలిని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లకల్లోలం..
[ 10-05-2024]
తమిళనాడు రాష్ట్రం పర్యాటకానికి పెట్టింది పేరు. అందులోనూ సముద్ర పర్యాటకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్షలాది, కోట్లాది మంది వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికొస్తున్నారు. -
దేశానికి మోదీ.. ఏపీకి చంద్రబాబు అవసరం
[ 10-05-2024]
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్కు నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్ అన్నారు. -
ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకం: ప్రేమలత
[ 10-05-2024]
డీఎంకే మూడేళ్ల పాలనలో ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు. -
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె
[ 10-05-2024]
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మె గురువారం రెండోరోజు కూడా కొనసాగింది. సింగపూర్, కోల్కతా, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. -
ఆత్మవిశ్వాసానికి చిరునామా.. తాన్సెన్
[ 10-05-2024]
పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేని పని ఏదీ ఉండదని ఓ యువకుడు నిరూపించాడు. చేతులు లేకపోయినా కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. -
లండన్లో కుమారుడితో ఉదయనిధి సందడి
[ 10-05-2024]
లండన్లో కుమారుడు ఇన్బనిధితో మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉల్లాసంగా గడుపుతున్నారు. -
తలమై సెయలగం సిరీస్ ట్రైలర్ విడుదల
[ 10-05-2024]
రాష్ట్ర రాజకీయ నేపథ్యంతో వసంతబాలన్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ సీరిస్ ‘తలమై సెయలగం’. కిశోర్, శ్రేయారెడ్డి, ఆదిత్య మేనన్, భరత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. -
లారీ డ్రైవరు దారుణహత్య
[ 10-05-2024]
పొన్నేరి సమీప కేఎన్.కండ్రిగకు చెందిన శివకుమార్ (33) లారీ డ్రైవరు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు