తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా గవర్నరు చర్యలు
తమిళ సంస్కృతి, రాష్ట్రప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గవర్నర్ మాట్లాడుతున్నారని టీఎన్సీసీˆ అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఆరోపించారు.
టీఎన్సీసీ అధ్యక్షుడి ఆరోపణ
వేలచ్చేరి, న్యూస్టుడే: తమిళ సంస్కృతి, రాష్ట్రప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా గవర్నర్ మాట్లాడుతున్నారని టీఎన్సీసీˆ అధ్యక్షుడు కేఎస్ అళగిరి ఆరోపించారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్లో విలేకర్లతో మాట్లాడుతూ..గవర్నరు ఆర్ఎన్ రవి నిరంతరం హద్దులు దాటి మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పెట్టుబడుల కోసం విదేశాలకు వెళితే గవర్నరు విమర్శించడం తగదన్నారు. ముఖ్యమంత్రి అడిగితే పెట్టుబడులు రావని పేర్కొనడం తగదని చెప్పారు. రాష్ట్రంలో విద్య సక్రమంగా లేదని గవర్నరు అంటున్నారని, ఇది కూడా సబబు కాదన్నారు. ఉత్తరప్రదేశ్కు వెళ్లని పెట్టుబడులు తమిళనాడుకు వస్తున్నాయంటే ఇక్కడ సాంకేతికత, మూల ధనం, మానవ వనరులు ఎక్కువగా ఉన్నట్లేనని పేర్కొన్నారు. అందుకే పెట్టబడులను ఆకర్షించే పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. నరేంద్ర మోదీ వచ్చాకే దేశం అభివృద్ధి చెందిందని గవర్నర్ పేర్కొన్నట్లు గుర్తుచేశారు. నిజంగా పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ల హయాంలోనే ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి పడిపోయిందన్నారు.
చెన్నైలోని పలు ప్రాంతాల్లో వర్షం
ప్యారిస్, న్యూస్టుడే: చెన్నై నగరంలో మంగళవారం పలు చోట్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా మంగళ, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. చెన్నై సెంట్రల్, పురసైవాక్కం, ఎగ్మూర్, నుంగంబాక్కం, కోడంబాక్కంలలో పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లకల్లోలం..
[ 10-05-2024]
తమిళనాడు రాష్ట్రం పర్యాటకానికి పెట్టింది పేరు. అందులోనూ సముద్ర పర్యాటకానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్షలాది, కోట్లాది మంది వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికొస్తున్నారు. -
దేశానికి మోదీ.. ఏపీకి చంద్రబాబు అవసరం
[ 10-05-2024]
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ప్రధాని మోదీ.. ఆంధ్రప్రదేశ్కు నారా చంద్రబాబు నాయుడి సారథ్యం అవసరమని కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్ అన్నారు. -
ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకం: ప్రేమలత
[ 10-05-2024]
డీఎంకే మూడేళ్ల పాలనలో ప్రజల జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత తెలిపారు. -
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె
[ 10-05-2024]
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది సమ్మె గురువారం రెండోరోజు కూడా కొనసాగింది. సింగపూర్, కోల్కతా, తిరువనంతపురం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. -
ఆత్మవిశ్వాసానికి చిరునామా.. తాన్సెన్
[ 10-05-2024]
పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేని పని ఏదీ ఉండదని ఓ యువకుడు నిరూపించాడు. చేతులు లేకపోయినా కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. -
లండన్లో కుమారుడితో ఉదయనిధి సందడి
[ 10-05-2024]
లండన్లో కుమారుడు ఇన్బనిధితో మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉల్లాసంగా గడుపుతున్నారు. -
తలమై సెయలగం సిరీస్ ట్రైలర్ విడుదల
[ 10-05-2024]
రాష్ట్ర రాజకీయ నేపథ్యంతో వసంతబాలన్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ సీరిస్ ‘తలమై సెయలగం’. కిశోర్, శ్రేయారెడ్డి, ఆదిత్య మేనన్, భరత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. -
లారీ డ్రైవరు దారుణహత్య
[ 10-05-2024]
పొన్నేరి సమీప కేఎన్.కండ్రిగకు చెందిన శివకుమార్ (33) లారీ డ్రైవరు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?
-
కేజ్రీవాల్కు ఊరట.. మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా