Vijay: మీ కాలు చెప్పులా ఉండటానికీ వెనుకాడను: హీరో విజయ్
‘దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అంటూ నటుడు విజయ్ తన అభిమానులను ఉద్దేశించి చెప్పారు.
కార్యక్రమంలో ప్రసంగిస్తున్న విజయ్
కోడంబాక్కం, న్యూస్టుడే: ‘దయచేసి ఓపిక పట్టండి. మన లక్ష్యం ఇది కాదు. వేరే ఉంది. అది గొప్పది. ఆ దిశగా అడుగులేద్దాం. భవిష్యత్తులో మనమేంటో చూపిద్దాం’ అంటూ నటుడు విజయ్ తన అభిమానులను ఉద్దేశించి చెప్పారు. లోకేష కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన కొత్త చిత్రం ‘లియో’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ‘లియో’ విజయోత్సవ వేడుక బుధవారం రాత్రి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. దాదాపు 10వేల మందికి పైగా అభిమానులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా విజయ్ మాట్లాడుతూ.. ‘నాపై ఇంత అభిమానం ఉంచుకున్న మీకు ఏదైనా తప్పకుండా చేయాలనుంది. చేస్తా. మీ కాలు చెప్పులా ఉండటానికి కూడా వెనుకాడను. ఇప్పుడేం జరిగినా పట్టించుకోకండా అందరూ ఓపిక పట్టండి. విజయాన్ని అందుకోవచ్చు అన్నారు. అలాగే ఓ పిట్టకథ చెబుతూ.. ‘ఇద్దరు వేటగాళ్లు అడవిలోకి వెళ్లారు. ఒకడు తన వద్ద ఉన్న బాణంతో కుందేలును గురుచూసి పట్టుకున్నాడు. ఇంకొకడు ఏనుగును లక్ష్యంగా చేసుకుని తన వద్ద ఉన్న ఆయుధాన్ని విసిరాడు. గురితప్పింది. ఉత్తచేతులతో ఇంటికి తిరిగొచ్చారు. నా దృష్టిలో కుందేలును పట్టుకున్న వ్యక్తి విజయం సాధించినట్టు కాదు. ఏనుగులాంటి పెద్ద లక్ష్యాన్ని ఛేదించాలని అనుకున్న వ్యక్తే గొప్పవాడు. అతను ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో పొందుతాడంటూ’ కథ వినిపించాడు. ఇది రజనీకాంత్ను పరోక్షంగా విమర్శించినట్లేనని సినీవర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంగ నాన్తాన్ కింగు ట్రైలర్ విడుదల
[ 28-04-2024]
ఆనంద్ నారాయణన్ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్కాంత్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం. -
తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలి
[ 28-04-2024]
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. -
రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు కేసు చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు
[ 28-04-2024]
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో గత నెల బాంబు పేలుడు సంభవించింది. -
కరవులో ఆదుకోనున్న క్వారీలు
[ 28-04-2024]
చెంగల్పట్టు జిల్లా పరిధిలోని గ్రామాలకు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా రాళ్ల క్వారీల నుంచి నీటిని సేకరించేందుకు చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. -
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు
[ 28-04-2024]
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి అన్యాయం
[ 28-04-2024]
కేంద్రంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. -
స్పీడ్ పోస్ట్ ద్వారా 2.5 లక్షల ఎల్ఎల్ఆర్లు
[ 28-04-2024]
‘లెర్నర్స్ లైసెన్స్’ (ఎల్ఎల్ఆర్), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను స్పీడ్ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ’ విభాగం పేర్కొంది. -
శ్రీవారిని దర్శించుకున్న దుర్గా స్టాలిన్
[ 28-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. -
నిరంతర కృషితో ఉన్నత పదవులకు..
[ 28-04-2024]
టీఎన్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో తిరుప్పూర్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగినులు ఉత్తీర్ణత సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్