logo

దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు

దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్‌ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు.

Published : 18 Apr 2024 01:17 IST

జయవర్ధన్‌

ఎన్నికల ప్రచారంలో జయవర్ధన్‌

సైదాపేట, న్యూస్‌టుడే: దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్‌ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. దక్షిణ చెన్నై నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో పెద్ద ఆస్పత్రి నిర్మిస్తామని, ఈఎస్‌ఐ వైద్యశాలను మరింత మెరుగుపరుస్తామని, సైదాపేట, గిండి, కోడంబాక్కం, మాంబలం తదితర రైల్వేస్టేషన్లలో వసతులు మెరుగుపరుస్తానని, సముద్ర నీటిని తాగునీటిగా మార్చే పథకం ద్వారా చెన్నైవ్యాప్తంగా సరఫరాకు చర్యలు తదితర వాటిపై పలు హామీలు ఇచ్చారు. ఆయన వెంట అన్నాడీఎంకే మాజీ మంత్రి గోకుల ఇందిరా, జిల్లా కార్యదర్శులు వేళచ్చేరి ఎంకే అశోక్‌, టీనగర్‌ సత్యా, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని