పొట్టకూటికి వచ్చి... హత్యకు గురయ్యారు
పొట్టకూటి కోసం వలస వచ్చి బతుకుతున్న దంపతులు హత్యకు గురయ్యారు. కర్ర, ఇనుప వస్తువుతో భార్యాభర్తల ముఖం, తలపై తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ సప్తగిరినగర్లో చోటు చేసుకున్న
చినముషిడివాడలో కాపలాదారు దంపతులు దారుణ హత్య
చిన ముషిడివాడ (పెందుర్తి), న్యూస్టుడే: పొట్టకూటి కోసం వలస వచ్చి బతుకుతున్న దంపతులు హత్యకు గురయ్యారు. కర్ర, ఇనుప వస్తువుతో భార్యాభర్తల ముఖం, తలపై తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఉలికిపాటుకు గురిచేసింది. జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ సప్తగిరినగర్లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇవి. ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి దరి అజ్జాడ గ్రామానికి చెందిన సుతారి అప్పారావు(60), లక్ష్మి(55) రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం వలస వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడు సత్యనారాయణ నగరంలోని బర్మాక్యాంపు ప్రాంతంలో ఉంటూ ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. మరో కొడుకు, కుమార్తె హైదరాబాద్లో ఉంటున్నారు. అప్పారావు దంపతులు తొలుత సుజాతనగర్లోని ఓ బిల్డర్ వద్ద కాపలాదారుగా పని చేశారు. అదే బిల్డర్కు చెందిన చినముషిడివాడ సప్తగిరినగర్లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం వద్దకు 20 రోజుల క్రితం కాపలాదారుగా వచ్చారు. సోమవారం మధ్యాహ్నం సుమారు అప్పారావు దంపతులు ఉన్న ప్రాంతాన్ని భవనం సూపర్వైజర్ నీల్కాంత్ పరిశీలించగా..వారిద్దరూ అచేతనంగా పడి ఉన్న విషయం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీసీపీ సుమిత్ సునీల్, ఏసీపీ పెంటారావు, సీఐ అశోక్కుమార్, క్లూస్ బృందం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ కుక్కలు భవనం చుట్టు పక్కనే సంచరించాయి. సమీప భవనంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఆస్తి తగాదాలు కాని, ఎలాంటి శత్రువులూ లేరని మృతుల కుమారుడు సత్యనారాయణ పేర్కొన్నారు. మృతదేహాలను శవపరీక్షకు పంపే విషయంపై సీపీఐ నాయకులు ఆర్.శ్రీనివాసరావు, వై.రాంబాబు అభ్యంతరం తెలిపారు. మృతులకు బిల్డర్ పరిహారం ప్రకటించాలని కుటుంబ సభ్యులతో కలిసి పట్టుబట్టారు. పోలీసుల సమక్షంలో బిల్డర్, భాగస్వాములతో చర్చించారు.
అక్కసుతోనే హత్య..?: అప్పారావు దంపతుల హత్యపై పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల ముఖం, తలపై సరుగుడు కర్రతో దాడి చేసినట్లు గుర్తించారు. అక్కడున్న కర్రను స్వాధీనం చేసుకున్నారు. కర్రతో పాటు ఇంకేదైనా లోహపు వస్తువును దాడికి ఉపయోగించి ఉంటారన్న అనుమానాలు క్లూస్ బృందం వ్యక్తం చేసింది. మరోవైపు ఎవరు హత్యకు పాల్పడి ఉంటారన్న విషయంపై స్పష్టత రాలేదు. సప్తగిరినగర్లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద అప్పారావు దంపతులు చేరక ముందు పని చేసిన వారిలో ఓ కాపలాదారుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన భవనానికి సమీపంలోనే నివాసం ఉంటున్న అతడిపై నిఘా ఉంచారు. చరవాణిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాను పని చేయాల్సిన చోట అప్పారావు దంపతులు చేరారన్న అక్కసుతో హత్యకు పాల్పడి ఉండవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.