తవ్వుకోనిస్తే తాయిలాలు.. అడ్డుకుంటే ఆగడాలు
ఎత్తయిన కొండలు.. ఎటు చూసినా ఆకుపచ్చని ప్రకృతి సౌందర్యం.. మధ్యలో సుందరకోట ఊరు. పేరుకు తగ్గట్టుగానే అదో అందమైన గిరిజన గ్రామం. ఇక్కడి ప్రజలు జీడితోటలు, జాఫ్రా, వరి పండించుకుని జీవిస్తున్నారు.
లేటరైట్ క్వారీ యజమానుల తీరిది
గిరిజనుల మొర ఆలకించేదెవరు?
ఈనాడు డిజిటల్, అనకాపల్లి, నర్సీపట్నం గ్రామీణం, నాతవరం, న్యూస్టుడే
కొండపై జీడి తోటల మధ్య చదును చేస్తున్న బ్లేడ్ ట్రాక్టర్
ఎత్తయిన కొండలు.. ఎటు చూసినా ఆకుపచ్చని ప్రకృతి సౌందర్యం.. మధ్యలో సుందరకోట ఊరు. పేరుకు తగ్గట్టుగానే అదో అందమైన గిరిజన గ్రామం. ఇక్కడి ప్రజలు జీడితోటలు, జాఫ్రా, వరి పండించుకుని జీవిస్తున్నారు. పంటల్లేనప్పుడు సమీపంలోని అడవుల్లోకి వెళ్లి అటవీ ఉత్పత్తులు సేకరించి అమ్ముకుంటారు. నాలుగైదు రోజులుగా వారందరిలో ఆందోళన నెలకొంది. కొన్నేళ్ల క్రితం ఆపేసిన లేటరైట్ తవ్వకాలను మళ్లీ మొదలెడతామంటూ ఇతర జిల్లాలకు చెందిన కొందరు రావడం, రోడ్డును సరిచేయించే పనులు చేపట్టడంతో వీరిలో ఆందోళన మొదలైంది.
* సుందరకోటకు ఆనుకుని ముల్లుకొండపై 2013 నుంచి మూడేళ్ల పాటు లేటరైట్ తవ్వకాలు జరిగేవి. ఆ తరవాత ఆగిపోయాయి. దాదాపు పన్నెండు ఎకరాల్లో లీజు కాలపరిమితి మరికొన్నేళ్లు ఉండడంతో మళ్లీ తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది. క్వారీ నుంచి ఊళ్లోని తారురోడ్డు వరకు దాదాపు కిలోమీటరు వరకు గతంలో మట్టిరోడ్డు ఉండేది. కొన్నేళ్లుగా రాకపోకలు లేకపోవడంతో దీనిపై తుప్పలు పెరిగిపోయాయి. క్వారీ ప్రతినిధులు ఇప్పుడు పొక్లెయిన్, బ్లేడ్ ట్రాక్టర్లతో రోడ్డు బాగు చేయించుకుంటున్నారు.
* కొండపై జీడి, జఫ్రా సాగుచేసుకుంటున్న కొందరు వెళ్లి తవ్వకాలు జరిగితే పంటలు పాడవుతాయి. క్వారీ లీజు ప్రదేశంలోనే జీడితోటలు ఉన్నాయి. తవ్వకాలు చేపట్టొద్దని లీజుదారుల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ‘తవ్వకాలు ఆగవు.. కూర్చుని మాట్లాడుకుందాం.. అందరం కలిసి ఓ అంగీకారానికి వద్దాం’ అంటూ ఆ ప్రతినిధులు నచ్చజెప్పారు. ఆ ప్రాంతానికి చెందిన కొందరు నాయకులు క్వారీ ప్రతినిధులకు తమ డిమాండ్లు తెలియజేశారు. రేషన్కార్డు ప్రాతిపదికన ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున నగదు, ఊళ్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల ఖర్చు కింద రూ.5 వేలు, ఊళ్లో ఎవరికైనా వివాహమైనా, చిన్నపాటి వేడుకలున్నా రూ. 5 వేల చొప్పున ఇవ్వాలని సూచించారు. దీనిపై ఆదివారం కూర్చోని తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
* దశాబ్దం క్రితం సరుగుడు పంచాయతీలో కొన్ని లేటరైట్ లీజులు ఖరారైనప్పుడు అప్పటి లీజుదారులు క్వారీల నుంచి గ్రామాల మీదుగా మట్టి రోడ్లు వేసుకున్నారు. ఏదోలా రోడ్డు వస్తుందని అప్పట్లో గిరిజనులు అడ్డుపెట్టలేదు. వీటిని ప్రభుత్వం తారురోడ్లుగా మార్పు చేసింది. కోర్టు కేసులు, గ్రీన్ ట్రైబ్యునల్కు ఫిర్యాదుల కారణంగా ఈ ప్రాంతంలోని ఇతర లేటరైట్ క్వారీల్లో కొన్నేళ్లుగా తవ్వకాలు ఆగిపోయాయి. తారురోడ్లు గిరిజనులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఒకప్పుడు కాలినడకే శరణ్యం. ఇప్పుడు నేరుగా ఊళ్లోకి ఆటోలు వస్తున్నాయి. బైకులు, స్కూటర్ల వినియోగం పెరిగింది. భారీ వాహనాలు తిరిగితే చక్కని తారురోడ్లు గోతులు పడతాయని భయపడుతున్న గిరిజనులు రోడ్లు పాడయితే ఎవరిది బాధ్యత అని క్వారీ ప్రతినిధులను నిలదీశారు. గోతులు ఆరునెలలకోసారి సొంత ఖర్చుతో పూడ్పిస్తాం.. లీజు పూర్తయ్యాక రోడ్లు పునరుద్ధరించుకోవడానికి రూ.5 లక్షలు ముందుగానే ఉమ్మడి ఖాతాలో జమచేస్తామని క్వారీ ప్రతినిధులు గ్రామపెద్దలకు నచ్చజెబుతున్నారు.
హద్దులు పరిశీలిస్తున్న అటవీ రేంజ్ అధికారి లక్ష్మీనర్సు
పర్యావరణానికి నష్టం
తవ్వకాలు, జనం రాకపోకలు తదితర కారణాల వల్ల విలువైన వృక్షాలు క్రమేపీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడి అడవుల్లో సింధుగ, సిరిమాను, నేరేడు తదితర వృక్షాలు ఉన్నాయి. యంత్రాల శబ్దం, వాహనాల రోద వల్ల వన్యప్రాణుల సంచారం తగ్గిపోతుంది. కొండగొర్రె, కణుజు, దుప్పి, కారుకోళ్లు, నెమళ్లు, అలుగుపంది తదితరాలు ఇక్కడి అడవుల్లో ఉన్నాయి. లేటరైట్ తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు నర్సీపట్నం అటవీరేంజ్ అధికారి లక్ష్మీనర్సు సిబ్బందితో కలిసి బుధవారం సుందరకోట వెళ్లి పరిశీలించారు. క్వారీ ప్రదేశానికి రిజర్వు అడవి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉందని రేంజ్ అధికారి తెలిపారు. అటవీ పరిధిలో కాకపోవడంతో వారంతా గిరిజనులతో మాట్లాడి వచ్చేశారు.
తవ్వనిచ్చేది లేదు
- పట్టెం లోవరాజు, సుందరకోట
క్వారీని ఆనుకుని కొండపై జీడితోట పెంచుకుంటున్నాం. గతంలో తవ్వకాలు సాగినప్పుడు 70 సెంట్ల విస్తీర్ణంలో తోటని మట్టితో కప్పేశారు. గట్టిగా అడిగితే రూ. రెండు లక్షలు పరిహారంగా ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు తవ్వుతామని చెబుతున్నారు. జీడితోటలు పూత పూస్తున్నాయి. తవ్వకాల వల్ల ధూళి ఎగిసి పూత దెబ్బతింటోంది. తవ్వకాలను అడ్డుకుంటా.
తోటలు ఎర్రబడుతున్నాయి
- జనుమూరి గంగరాజు, సుందరకోట
ముల్లుకొండపై నాలుగెకరాల వరకు జీడితోట ఉంది. గతంలో లేటరైట్ తవ్వినప్పుడు ఎర్రమట్టి ధూళికి జీడితోటంతా ఎర్రగా మారిపోయింది. రాళ్లొచ్చి తోటలో పడిపోయేవి. దిగుబడి తగ్గేది. తవ్వకాల కోసం ఆరాటమే గానీ సాగుదార్ల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. మొన్న పొక్లయిన్ వచ్చినప్పుడు అడ్డుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..