వీధి వ్యాపారులపై పిడుగు
జీవీఎంసీ, పోలీసుల ఆంక్షలు నగరంలోని వీధి వ్యాపారుల జీవితాల్లో కలవరం రేపుతున్నాయి. రోడ్డు పక్కన, ఫుట్పాత్లపై ఉంటున్న వేలాది మందిని అక్కడి నుంచి తొలగించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇతర ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు
పోలీసులు, జీవీఎంసీ సిబ్బంది హడావుడి
తెడ్డు వెంకటేశ్వరరావు, ఏపీ వీధి విక్రయదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కార్పొరేషన్, న్యూస్టుడే: జీవీఎంసీ, పోలీసుల ఆంక్షలు నగరంలోని వీధి వ్యాపారుల జీవితాల్లో కలవరం రేపుతున్నాయి. రోడ్డు పక్కన, ఫుట్పాత్లపై ఉంటున్న వేలాది మందిని అక్కడి నుంచి తొలగించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జీ-20 సన్నాహక సదస్సులకు దేశవిదేశాల ప్రతినిధులు వస్తున్నారని, వారి వాహనాలకు ఎటువంటి ఆటంకం లేకుండా రద్దీ కూడళ్లు, ప్రధాన రహదారుల్లో వ్యాపారాలు చేయకుండా అడ్డుకుంటున్నారు. వీఐపీలు తిరిగే ప్రాంతాల్లో కాకుండా నిర్మాణుష్య ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఇతర ప్రాంతాలకు వెళుతుండగా, కొంత మంది వ్యాపారాలకు దూరమవుతున్నారు. సదస్సుకు ఇంకా నెలరోజులకుపైగా సమయం ఉండగా, ఇప్పుడే వీధి వ్యాపారులను ఖాళీ చేయిస్తుండడం గమనార్హం. గుర్తించిన ప్రాంతాల్లోనూ శాశ్వతంగా వ్యాపారాలు చేయనీయకుండా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
* విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించడంతో అధికారుల హడావుడి మొదలైంది. సీఎం కాన్వాయ్ తరచూ సంచరించే ప్రాంతాలుగా కొన్ని గుర్తించి, అక్కడున్న వ్యాపారులను పూర్తిగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నారని తోపుడుబళ్ల కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు.
20వేల మందిపై ప్రభావం: అనకాపల్లి నుంచి భీమిలి వరకు దాదాపు 20వేల మంది వీధి వ్యాపారులు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గతంలో అంతర్జాతీయ నావికాదళ విన్యాసాలు, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వచ్చే మార్గాల్లో రెండు, మూడు రోజులపాటు వ్యాపారం చేయవద్దన్నారు. ఇప్పుడు గుర్తించిన 22 ప్రాంతాల నుంచి తరలించడానికి అధికారులు ప్రణాళికలు రచించారు. విమానాశ్రయం నుంచి తాటిచెట్లపాలెం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా, ప్రధాన కూడళ్లలో వ్యాపారాలకు అనుమతించడంలేదు. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో ఉన్న వారికి ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రహదారి పక్కన వ్యాపారాలను పూర్తిగా నియంత్రించనున్నారు.
* జీవీఎంసీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం వీధి వ్యాపారులు ప్రధాన జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కమిషనర్ రాజాబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ వ్యాపారాలు నష్టపోయేలా సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీఐటీయూ నాయకులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ సదస్సుల పేరిట వ్యాపారులను వెళ్లగొట్టడం సరికాదన్నారు.
హక్కులను హరిస్తున్నారు..
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వీధి వ్యాపారులకు స్థానిక సంస్థలు స్థలాలను చూపాలి. వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి. విశాఖలో దానికి విరుద్ధంగా వీధి వ్యాపారులు, తోపుడుబళ్ల కార్మికులను అధికారులు శత్రువుల్లా చూస్తున్నారు. వారి హక్కులను కాలరాస్తున్నారు. సదస్సు జరిగే రెండు రోజులు సహకరిస్తాం తప్ప, రెండు నెలలపాటు వ్యాపారాలు మానేయాలని కోరడం సరికాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.