అడ్డుపడినా.. అప్పగించేశారు!
‘అక్కడ క్వారీకి అనుమతులు ఇవ్వొద్దు. చుట్టూ ఉన్న పంట భూములు పాడైపోతాయి. జీవనోపాధి దెబ్బతింటుంది. పైగా గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి అక్కడే భూములిచ్చారు.
ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకించినా క్వారీకి అనుమతులు
అధికారపార్టీ అండతో చకచకా కదిలిన దస్త్రాలు?
గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం భూముల సమీపాన తవ్వకాలకు సిద్ధం
ఆనందపురం మండలం జగన్నాథపురం వద్ద గ్రేహౌండ్స్కు కేటాయించిన ఈ స్థలానికి సమీపంలోనే క్వారీకి అనుమతులిచ్చారు...
ఈనాడు డిజిటల్ విశాఖపట్నం: ‘అక్కడ క్వారీకి అనుమతులు ఇవ్వొద్దు. చుట్టూ ఉన్న పంట భూములు పాడైపోతాయి. జీవనోపాధి దెబ్బతింటుంది. పైగా గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి అక్కడే భూములిచ్చారు. ఇప్పుడదేచోట గ్రావెల్ తవ్వేస్తాం..రాళ్లు పట్టుకుపోతామంటే కుదరదు’ అని ఈ ఏడాది జనవరి 10న ఆనందపురం మండలం జగన్నాథపురంలో జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే పెద్దలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందన్నట్లు ఈ క్వారీకి అనుమతులు మంజూరయ్యాయి.
అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో దరఖాస్తుదారునికి అనుకూలంగా సంబంధిత శాఖల నుంచి దస్త్రాలు చకా..చకా కదిలినట్లు తెలుస్తోంది.
18 ఏళ్ల పాటు గ్రావెల్, మెటల్ తవ్వుకోవడానికి గతనెల 27నే పర్యావరణ అనుమతులు ఇచ్చేశారు. పని మొదలుపెట్టడానికి అవసరమైన కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ఈ) ఉత్తర్వులను కాలుష్యనియంత్రణ మండలి ఈ మధ్యనే జారీచేసింది. ఇక గనులశాఖకు డబ్బులు కట్టి పర్మిట్లు తీసుకుని తవ్వుకోవడమే మిగిలింది.
సమస్యలొస్తాయంటున్నా...
అనందపురం మండలం జగన్నాథపురం సర్వే నెంబర్ 1లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి నాలుగేళ్ల క్రితం 385 ఎకరాలు కేటాయించారు.రెండేళ్ల క్రితం ఆ భూముల్లో కొంతమేర సంబంధితశాఖ తరఫున భూ సేకరణ పూర్తిచేశారు. ఇప్పుడు అదే సర్వే నెంబర్లో 50 ఎకరాల్లో గ్రావెల్, మెటల్ క్వారీ తవ్వకాలు చేపట్టబోతున్నారు. రెండూ ఒకే సర్వే నెంబర్లో ఉన్నా గ్రేహౌండ్స్కు, క్వారీకి సంబంధం లేదని అధికారులు సమర్థించుకుంటున్నా పోలీసు బలగాల్లో కీలకమైన విభాగం శిక్షణ కేంద్రానికి సమీపంలో తవ్వకాలు చేపట్టడం వల్ల సమస్యలు వస్తాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. పైగా ప్రతిపాదిత క్వారీ స్థలానికి సమీపంలోనే ఇటీవల జగనన్న కాలనీలకు స్థలాలు కూడా ఇచ్చారు. మంత్రి ఒకరు సీఎంవో కార్యాలయం నుంచి ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా అనుమతులు తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాయువేగంతో..
ఉమ్మడి విశాఖ జిల్లాలో మెటల్, గ్రానైట్, గ్రావెల్ క్వారీలకు సంబంధించి ప్రజాభిప్రాయసేకరణలు పూర్తయి ఆరు నెలలు నుంచి ఏడాది గడిచినా పలు చోట్ల ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. జగన్నాథపురం క్వారీ విషయంలో మాత్రం అనుమతులన్నీ ఆగమేఘాలపై వచ్చేస్తున్నాయి. 2017లో ఇక్కడ క్వారీకి రెవెన్యూ అధికారులు ఎన్వోసీ ఇచ్చారు. ఆ తర్వాత 2018లో గ్రేహౌండ్స్కు భూములు కేటాయించారు. అప్పుడిచ్చిన ఎన్వోసీ పట్టుకుని ఈ ఏడాది జనవరి 10న ప్రజాభిప్రాయసేకరణ జరిపారు. జనవరి 30న పర్యావరణ అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఫిబ్రవరి 2న స్టేట్ లెవల్ ఎక్స్పర్ట్ ఎప్రయిజల్ కమిటీ (ఎస్ఈఏసీ) సమావేశంలో ఆమోదం తెలిపారు. 18 ఏళ్ల పాటు ఏడాదికి 1.45 లక్షల క్యూబిక్ మీటర్ల రఫ్ మెటల్, 3.40 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వుకోవడానికి ఫిబ్రవరి 27న పర్యావరణ అనుమతులు ఇచ్చేశారు. ప్రజాభిప్రాయసేకరణ తర్వాత అధికారులు ఇలాంటిదేదో చేస్తారని ఊహించే స్థానికులు కొందరు కోర్టులో రిట్ పిటీషన్ వేశారు. ఆ తరువాత ఆగమేఘాలపై మిగతా అనుమతులన్నీ వచ్చేశాయి. ఈ విషయమై గనులశాఖ, కాలుష్యనియంత్రణ మండలి అధికారులు నోరువిప్పడం లేదు. ఆనందపురం తహసీల్దారు రామారావు వద్ద ప్రస్తావించగా ఎన్వోసీ గురించి తనకు తెలియదని రైతులు కొందరు కోర్టులో పిటీషన్ వేస్తే ప్రజాభిప్రాయసేకరణ సమయంలో స్థానికులంతా ఈ క్వారీకి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని కౌంటర్ రూపంలో కోర్టు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు తమకు రాలేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
[ 25-04-2024]
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా అరాచకాల్ని ప్రశ్నిస్తే దాడులు
[ 25-04-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా నశించిందని, వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారిని దోషులుగా చిత్రీకరించి, నానా హింసలు పెడుతున్నారని విశాఖ పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఎం.శ్రీ భరత్ ఆరోపించారు. -
కూటమి వెంట జన బలం!!
[ 25-04-2024]
కూటమి అభ్యర్థుల నామినేషన్లకు భారీగా తరలివచ్చిన అభిమానులతో నగరంలో బుధవారం సందడి నెలకొంది. తెదేపా అభ్యర్థులు పల్లా శ్రీనివాసరావు (గాజువాక), గణబాబు (పశ్చిమం), జనసేన అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ (దక్షిణం), పంచకర్ల రమేశ్బాబు (పెందుర్తి) పెద్ద ఎత్తున తరలివచ్చిన జనసందోహంతో ర్యాలీగా వెళ్లి నామినేషన్లను సమర్పించారు. -
జగన్ మోపిన భారం.. ఇసుకే బంగారం!!
[ 25-04-2024]
ఆర్థిక రాజధాని విశాఖలో నిర్మాణ రంగం చాలా కీలకమైనది. ఎన్నో పరిశ్రమల్లో, భారీ నిర్మాణాల్లో నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి. వీటితో పాటు పెద్ద సంఖ్యలోనే ఇళ్లు, ఇతరత్రా నిర్మాణాలు సాగుతుంటాయి. -
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ