YSRCP: డాక్టరమ్మకు వైకాపా షాక్!
అనకాపల్లి ఎంపీ డాక్టరు భీశెట్టి వెంకటసత్యవతికి వైకాపా షాక్ ఇచ్చింది. రెండోసారి ఎంపీ బరిలో పోటీచేయాలన్న సత్యవతి ఆశలపై అధికార పార్టీ నీళ్లు చల్లేసింది.
ఎంపీ బరిలోకి మంత్రి ముత్యాలనాయుడు
మాడుగుల అసెంబ్లీ టికెట్ కుమార్తె అనురాధకు..
ముత్యాల నాయుడు, అనురాధ
ఈనాడు అనకాపల్లి, న్యూస్టుడే, అనకాపల్లి: అనకాపల్లి ఎంపీ డాక్టరు భీశెట్టి వెంకటసత్యవతికి వైకాపా షాక్ ఇచ్చింది. రెండోసారి ఎంపీ బరిలో పోటీచేయాలన్న సత్యవతి ఆశలపై అధికార పార్టీ నీళ్లు చల్లేసింది. ఆమె స్థానంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడ్ని బరిలోకి దించుతున్నారు. ఇదివరకు మాడుగుల నుంచి మంత్రి మూడోసారి పోటీచేస్తారని ప్రకటించింది. అయితే సామాజిక సమీకరణాలతో అనకాపల్లి ఎంపీ స్థానానికి బదిలీ చేసింది. మాడుగులలో బూడి కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధకు వైకాపా అవకాశం ఇచ్చింది.
గత ఎన్నికల ముందు వరకు డాక్టరు భీశెట్టి వెంకటసత్యవతి తెదేపాలో ఉన్నారు. అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆమెకు ఆఖరి నిమిషంలో వైకాపా ఎంపీ టికెట్ ప్రకటించింది. 2019లో పార్లమెంటు పరిధిలోని అన్ని సెగ్మెంటెలలోను ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఈమె సులభంగానే గెలుపొందారు. అనకాపల్లి నుంచి తొలి మహిళా ఎంపీగా రికార్డులకు ఎక్కారు. గడిచిన అయిదేళ్లలో ఆమె పార్టీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిచారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో, ప్రజాప్రతినిధిగా మెరుగైన పనితీరు కనబరిచారు. ఈ ఎన్నికల్లో ఆఖరి నిమిషం వరకు సీటు కొనసాగింపు విషయమై ఊరించి పక్కన పెట్టేసింది. సీటు విషయంలో పార్టీ మొండిచేయి చూపించడాన్ని ఆమె వర్గీయులు తప్పుబడుతున్నారు.
సత్యవతి
గవర సామాజిక వర్గానికి మొండిచేయి: అనకాపల్లి జిల్లాలో కాపుల తర్వాత బలమైన సామాజిక వర్గం గవర్లు. జిల్లాలోని ఏ ఒక్క అసెంబ్లీ టిక్కెట్ను వైకాపా గవర్లకు కేటాయించలేదు. అనకాపల్లిలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థిగా గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణను బరిలో దించారు. వైకాపా తరఫున కాపు సామాజిక వర్గం నుంచి మలసాల భరత్ పోటీలో ఉన్నారు. వైకాపా నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన సత్యవతికి ఎంపీ టికెట్ మరోమారు ఇస్తారని ఆమె వర్గీయులు భావించారు. తెదేపా కూటమి అభ్యర్థిగా వెలమదొర సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ను రంగంలోకి దించారు. దీంతో వైకాపా కూడా వెలమ సామాజిక వర్గం నేత బూడి ముత్యాలనాయుడ్ని పోటీలో దింపడం గమనార్హం. అయితే జిల్లాలో అదే సామాజికవర్గానికి రెండు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించి, అధికంగా ఉన్న గవర సామాజిక వర్గానికి ఒక సీటు కూడా కేటాయించలేదు. దీంతో ఆ సామాజిక వర్గంలో నేతలు గుర్రుగా ఉన్నారు. టికెట్ల విషయంలో పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం