logo

సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి

విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి.

Published : 28 Mar 2024 02:44 IST

ఘటనాస్థలిలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే : విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా కశింకోటకు చెందిన అల్లవరపు గణేష్‌(32) కుటుంబం ఉపాధి కోసం వచ్చి దువ్వాడ సమీప మంగళపాలెంలో నివాసం ఉంటోంది. ఆటోనగర్‌ ఎఫ్‌-బ్లాక్‌లోని టీపీఎల్‌ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న గణేష్‌ మంగళవారం రాత్రి విధులకు వెళ్లాడు. బుధవారం ఉదయం ఇంటికి తిరిగి రాకపోవడంతో... భార్య దేవి కంగారు పడి తోటి సెక్యూరిటీ గార్డు కె.శ్రీనుకు ఫోన్‌ చేశారు. అప్పటికే పరిశ్రమ ఆవరణలో ఉన్న నీటి సంపులో పడి గణేష్‌ మృతి చెంది ఉన్నాడన్న సమాచారంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. పరిశ్రమ యాజమాన్యం అందించిన సమాచారంతో దువ్వాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడికి మూడేళ్ల కిందట వివాహమైంది. భార్య దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని