logo

జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్‌

రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు.

Published : 28 Mar 2024 02:47 IST

వంశీకృష్ణ శ్రీనివాస్‌తో మన్యాల శ్రీనివాస్‌, ఇతర నాయకులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఉదయం తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 29వ వార్డుకు చెందిన వైకాపా బీసీ సెల్‌ అధ్యక్షులు మన్యాల శ్రీనివాస్‌, అనుచరులు జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ శ్రీనివాస్‌ వారికి పార్టీ కండువాలను వేసి సాదరంగా స్వాగతం పలికారు. మన్యాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌, వైకాపాలకు 25ఏళ్లగా తాను  సేవలందించానని, అయినప్పటికీ వైకాపా నాయకులు తనను వేధించారన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సారథ్యం అవసరమని, యువతకు ఉపాధి కలగాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు. వాసుపల్లి గణేష్‌కుమార్‌ను ఓడించి తగిన బుద్ధి చెబుతామన్నారు. వంశీకృష్ణ గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. వైకాపా బీసీ సెల్‌ నాయకులు మైలపల్లి సూర్యారావు, పాలికల పెద్దరాజు, పెందుర్తి గిరిబాబు, పెద్దాత తేజ తదితరులు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని