అక్రమంగా తోడేస్తున్నారు
అనుమతులు అవసరం లేదు.. కావాల్సినంత మట్టిని కాజేయొచ్చు.. అడిగిన గ్రామ పెద్దలకు కాస్తో కూస్తో సమర్పిస్తే పనికి అడ్డుపడరు.. అని భావించారో ఏమో కానీ వారం రోజులుగా మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన గోపీనాథపట్నాయక్ చెరువులో మట్టిని అక్రమంగా తోడేస్తున్నారు.
గోపీనాథపట్నాయకుని చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు
గజపతినగరం(మెంటాడ), న్యూస్టుడే: అనుమతులు అవసరం లేదు.. కావాల్సినంత మట్టిని కాజేయొచ్చు.. అడిగిన గ్రామ పెద్దలకు కాస్తో కూస్తో సమర్పిస్తే పనికి అడ్డుపడరు.. అని భావించారో ఏమో కానీ వారం రోజులుగా మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన గోపీనాథపట్నాయక్ చెరువులో మట్టిని అక్రమంగా తోడేస్తున్నారు. జేసీబీలు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తిరుగుతున్నా.. స్థానికంగా ఉన్న, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తెలిసీ ఊరుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులు గ్రామంలో కొందరికి తాయిలాలు అందించి, మట్టిని తవ్వుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
చెరువులో మట్టిని తరలించి.. పక్కన ఉన్న పొలాలను ఎత్తు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఇరిగేషన్ అధికారుల సూచనల మేరకు చెరువుల్లో మట్టిని తీయాలి. చెరువు లోతైతే నీరు దిగువ భాగంలో ఉండిపోయి, మదుములకు అందని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సందర్భాల్లో ఆయకట్టులో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని స్థానిక వీఆర్వో మురళి వద్ద ప్రస్తావించగా.. తవ్వకాల గురించి తనకు తెలియదని, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుసా జగన్.. ప్రాణాల విలువ
[ 27-04-2024]
జగన్.. నా గిరిజనులు అన్నావ్.. అన్నగా అండగా ఉంటానన్నావ్.. మరి ఎందుకు కొండ శిఖర గ్రామాలను వదిలేశావ్.. -
116 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎంపీ, నియోజకవర్గ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. సక్రమంగా లేని 116 నామపత్రాలను అధికారులు తిరస్కరించారు. -
ఓటింగ్ శాతం పెంపునకు కృషి
[ 27-04-2024]
జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ కోరారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలోని 31 కేంద్రాల్లో శనివారం పాలీసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈమేరకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సమన్వయాధికారులు ఆశా రమణి, -
తెదేపాలోకి ముద్దాడ
[ 27-04-2024]
వైకాపా నేత, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు యాదవ్ శుక్రవారం తెదేపాలో చేరారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
రూ.6.47 కోట్ల బంగారం, వెండి వస్తువుల స్వాధీనం
[ 27-04-2024]
వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు