ఓ పాలకా.. హామీలు కొట్టుకుపోయినట్లేనా!
జిల్లాకు మణిహారంగా సాగరతీరం నిలుస్తోంది.. ఇక్కడ ఇసుక తిన్నెలతో ఆకర్షించే బీచ్ల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులకు నిరాశే మిగులుతోంది.
అభివృద్ధికి నోచుకోని తీర గ్రామాలు
న్యూస్టుడే, భోగాపురం/పూసపాటిరేగ
చింతపల్లి తీరంలో పర్యాటక కేంద్రం దుస్థితి
జిల్లాకు మణిహారంగా సాగరతీరం నిలుస్తోంది.. ఇక్కడ ఇసుక తిన్నెలతో ఆకర్షించే బీచ్ల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులకు నిరాశే మిగులుతోంది.
భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో 29 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. పాలకులు మారుతున్నా... పర్యాటకావృద్ధికి నోచుకోవడం లేదు. వైకాపా హయాంలోనూ ప్రజాప్రతినిధులు హామీలు గుప్పించినా.. నెరవేర్చే దిశగా చొరవ కరవైంది. జీవనోపాధి మెరుగుకు ఆస్కారం లేకుండా పోయిందని మత్స్యకారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
చింతపల్లి తీరం సందర్శకులను ఆకర్షిస్తోంది. తెదేపా హయాంలో పూసపాటిరేగ మండలంలోని ఈ బీచ్లో రూ.కోటి వెచ్చించి పర్యాటక కేంద్రం భవనాలను నిర్మించారు. రెండు, మూడేళ్లు వీటి నిర్వహణ బాగానే ఉన్నా.. వైకాపా అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు. నిరుపయోగంగా ఉన్న భవన సముదాయం దెబ్బతింటున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఖాళీగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఇక్కడ వసతి సదుపాయం ఉన్నా నిర్వహణ లేక అధ్వానంగా మారడంతో పర్యాటకులకు ఉపయోగ పడకుండా పోతోంది.
జెట్టీ హామీ గల్లంతు
గత ఏడాది మే 3న చింతపల్లి తీరానికి ఆనుకుని ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రూ.27 కోట్ల నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. తీరంలో పడవలు దెబ్బతినకుండా నిలిపేందుకు జెట్టీ ఉపయోగపడుతుందని, వలస పోకుండా స్థానికంగా చేపల వేట సాగించొచ్చని మత్స్యకారులు భావించారు. ఇంత వరకు అంగుళం కూడా పని జరగకపోవడంపై వారి ఆశలు అడియాసలయ్యాయి. జెట్టీ హామీ అలల్లో కొట్టుకుపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇది అందుబాటులోకి వస్తే 16 తీర గ్రామాలకు చెందిన నాలుగు వేల మత్స్యకార కుటుంబాల్లో కనీసం 20 వేల మందికి ప్రయోజనం చేకూరేది.
ముక్కాంలో రక్షణగోడ లేక అలల ధాటికి దెబ్బతిన్న రోడ్డు, ఇళ్లు
ఏదీ రక్షణ?
భోగాపురం మండలంలో ముక్కాం తీరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. జాతీయ రహదారికి దగ్గరగా, అనుసంధానంగా ఉన్న ప్రాంతమిది. ఉన్నతాధికారులు, నాయకులు సందర్శనీయ ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేసినా కార్యరూపం దాల్చలేదు. ఇందుకు పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నా.. అడుగులు ముందుకు పడలేదు. ఈ ప్రతిపాదనలను పాలకులు గాలికొదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అలల తాకిడితో తీరం ఛిద్రమైంది. తుపాను సమయంలో సముద్రం ముందుకు రావడంతో ఒడ్డు కోతకు గురవుతోంది. తీరంలో ఉన్న రహదారి దెబ్బతినడమే కాకుండా చేపలు ఆరబోసే ప్లాట్ఫాం కూడా ధ్వంసమైంది. ఇక పడవలతో పాటు నివాసాలు కొట్టుకుపోతున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ తీరంలో రక్షణ గోడ నిర్మాణానికి కొంత మొత్తం కేటాయించినా పనుల ఊసే లేదు. ఇదే మండలంలో చేపలకంచేరు, తిప్పలవలస, బర్రిపేట తదితర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుసా జగన్.. ప్రాణాల విలువ
[ 27-04-2024]
జగన్.. నా గిరిజనులు అన్నావ్.. అన్నగా అండగా ఉంటానన్నావ్.. మరి ఎందుకు కొండ శిఖర గ్రామాలను వదిలేశావ్.. -
116 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎంపీ, నియోజకవర్గ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. సక్రమంగా లేని 116 నామపత్రాలను అధికారులు తిరస్కరించారు. -
ఓటింగ్ శాతం పెంపునకు కృషి
[ 27-04-2024]
జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ కోరారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలోని 31 కేంద్రాల్లో శనివారం పాలీసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈమేరకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సమన్వయాధికారులు ఆశా రమణి, -
తెదేపాలోకి ముద్దాడ
[ 27-04-2024]
వైకాపా నేత, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు యాదవ్ శుక్రవారం తెదేపాలో చేరారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
రూ.6.47 కోట్ల బంగారం, వెండి వస్తువుల స్వాధీనం
[ 27-04-2024]
వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు