మహబూబాబాద్కు పూర్తిస్థాయి జిల్లా కోర్టు
రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను జ్యుడిషియల్ జిల్లాలుగా విభజన ప్రక్రియ చేపట్టింది. ఈమేరకు మహబూబాబాద్కు పూర్తి స్థాయి జిల్లా న్యాయస్థానం మంజూరైంది.
మహబూబాబాద్, నెహ్రూసెంటర్, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను జ్యుడిషియల్ జిల్లాలుగా విభజన ప్రక్రియ చేపట్టింది. ఈమేరకు మహబూబాబాద్కు పూర్తి స్థాయి జిల్లా న్యాయస్థానం మంజూరైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన జిల్లా న్యాయస్థానాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ సూచనలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అనుమతితో నూతన జిల్లాలో జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలతో 2016లో మహబూబాబాద్ నూతన జిల్లాగా ఏర్పడింది. జిల్లా ఏర్పాటుకు పూర్వం మహబూబాబాద్ కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఆరో అదనపు జిల్లా కోర్టులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మహబూబాబాద్ కోర్టు ప్రాంగణంలో ఫాస్ట్ ట్రాక్ (ప్రత్యేక పోక్సో కోర్టు) ప్రారంభించారు. కాగా, తాజా ప్రకటనతో ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులో ఉన్న జ్యుడిషియల్ కేసులను ఈ నెల చివరినాటికి మహబూబాబాద్కు బదిలీ చేయనున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నుంచి పూర్తిస్థాయి జిల్లా కోర్టు తన కార్యకలాపాలు కొనసాగించనుందని ప్రభుత్వం పేర్కొంది.
కక్షిదారులకు ఊరట..
ఉమ్మడి జిల్లా వరంగల్లో జిల్లా కోర్టు ఉండటం వల్ల కేసుల విచారణ కోసం అక్కడికి వెళ్లేందుకు జిల్లా కోర్టు దూరంగా ఉండటంతో ఈ ప్రాంతానికి చెందిన కక్షిదారులు ఇబ్బందులకు గురయ్యేవారు. అధిక వ్యయ, ప్రయాసలు ఎదుర్కొంటూ పలు కేసుల విచారణకు అక్కడికి వెళ్లే కక్షిదారులకు ఇకపై ఊరట లభించనుంది. మహబూబాబాద్లో ప్రస్తుతం కోర్టు సముదాయంలో ఉన్న భవనంలోనే పూర్తిస్థాయి జిల్లా కోర్టుకు ఓ భవనాన్ని కేటాయిస్తారు. కాగా, మహబూబాబాద్లో నూతన శాశ్వత కోర్టు భవనం నిర్మించేందుకు నూతన కలెక్టర్ భవన సముదాయం సమీపంలో స్థలం కేటాయించినట్లు తెలుస్తుంది.
ఆ మండలాలు కూడా.. దీని పరిధిలోకే..
ప్రస్తుతం వరంగల్ జిల్లా నర్సంపేట కోర్టు పరిధిలో ఉన్న గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలను మహబూబాబాద్ జిల్లా కోర్టు పరిధిలోకి చేర్చారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు కోర్టు పరిధిలో ఉన్న బయ్యారం, గార్ల మండలాలను కూడా ఈ జిల్లా పరిధిలోకి బదిలీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని సివిల్, క్రిమినల్ వ్యాజ్యాలు నూతనంగా ఏర్పడనున్న జిల్లా కోర్టు పరిధిలోకి వస్తాయి.
హర్షణీయం: తుంపిళ్ల శ్రీనివాస్, లీగల్ ఏయిడ్ కౌన్సిల్
మహబూబాబాద్కు పూర్తి స్థాయి జిల్లా కోర్టు మంజూరుకావడం హర్షణీయం. ఇక నుంచి కక్షిదారులు వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టుకు వెళ్లాల్సిన పని ఉండదు, దీంతో పాటు వ్యయ ప్రయాసలు తప్పనున్నాయి. పూర్తిస్థాయి జిల్లా కోర్టు ఏర్పాటుతో ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ, కుటుంబ తగాదాలతో పాటు ఇతర క్రిమినల్ కేసులు ఇక్కడే విచారించనున్నారు. మహబూబాబాద్లో జిల్లా కోర్టు ఏర్పడటం న్యాయసేవలో పురోగతిగానే చెప్పవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు