వర్సిటీలో కొత్త కోర్సులు
దేశ పురోగతి విశ్వవిద్యాలయాలపై ఆధారపడి ఉంటుంది. అక్కడ బోధన, పరిశోధన నాణ్యమైనవి అందితేనే విద్యార్థులు ప్రగతి సాధించి తద్వారా దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.
చుట్టూ ప్రహరీ నిర్మిస్తాం
త్వరలోనే వసతి గృహాల సమస్యకు పరిష్కారం
కేయూ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్
ఈనాడు, వరంగల్, న్యూస్టుడే, కేయూక్యాంపస్
దేశ పురోగతి విశ్వవిద్యాలయాలపై ఆధారపడి ఉంటుంది. అక్కడ బోధన, పరిశోధన నాణ్యమైనవి అందితేనే విద్యార్థులు ప్రగతి సాధించి తద్వారా దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. నిధులు, నియామకాలు లేక కునారిల్లుతున్న తరుణంలో అనేక సవాళ్ల మధ్య కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా గతేడాది మే 23న బాధ్యతలు స్వీకరించారు ఆచార్య తాటికొండ రమేశ్. ఉన్న వనరులతోనే వర్సిటీ వికాసానికి కృషి చేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. నాలుగేళ్ల తరువాత తాజాగా పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీసీగా నేటితో ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భంగా వివిధ అంశాలపై ఉపకులపతితో ‘ఈనాడు’ ముఖాముఖి..
ఈనాడు: విశ్వవిద్యాలయంలో ఇటీవల 65 మంది అధ్యాపకులు పదవీ విరమణ పొందారు. బోధన ఎలా కొనసాగిస్తారు?
వీసీ: నేను ఏడాది కిందట బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విశ్వవిద్యాలయంలో ఒక్కో అంశంపై దృష్టిపెడుతున్నా. రెగ్యులర్ అధ్యాపకుల ఖాళీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నా, ప్రభుత్వం ఒప్పంద అధ్యాపకులను సరిపడా నియమించింది. కాంట్రాక్టు వారు 207 మంది ఉన్నారు. వారికి మెరుగైన జీతభత్యాలు అందించేందుకు కృషి చేస్తున్నాం. అలాగే తరగతులు క్రమం తప్పకుండా జరిగేలా చూస్తాం. త్వరలోనే సిబ్బంది సక్రమంగా వస్తున్నారా లేదా చూసేందుకు యాప్ను కూడా తీసుకురానున్నాం.
వర్సిటీని నిధుల కొరత వేధిస్తోంది. పరిశోధనలు చేయడం సవాలు కాదా?
యూజీసీ గత కొన్నేళ్లుగా ‘రూసా’ సాప్, డీఎస్టీ, ఫిస్ట్ తదితర ప్రాజెక్టుల ద్వారా వర్సిటీలో ప్రయోగాలకు నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్లో బ్లాక్ గ్రాంటు కింద అదనంగా మరో రూ.30 కోట్లు రావడంతో జీతాల చెల్లింపునకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక పరిశోధనలకు మరో రూ.30 కోట్లు మంజూరయ్యేలా ప్రయత్నిస్తున్నాం. దీనికి తోడు అనేక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ప్రవేశపెట్టాం.
విద్యార్థులకు హాస్టల్ వసతి సరిపడక ఇబ్బంది పడుతున్నారు కదా?
వర్సిటీలో ఇంజినీరింగ్తో పాటు అన్ని విభాగాల్లో విద్యార్థినుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 70 శాతం వారే చేరుతున్నారు. ఈ క్రమంలో హాస్టళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాం. రెండు వుమెన్స్ హాస్టళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఒకటి రూ.7 కోట్లతో, మరొకటి సుబేదారి ఆర్ట్స్కళాశాల వద్ద 200 పడకల హాస్టల్ అందుబాటులోకి రానుంది. బాయ్స్ హాస్టల్కు టెండర్లు పిలుస్తున్నాం. దీంతో వసతికి ఇబ్బంది ఉండదు.
కొత్త కోర్సులు ఏమేం తెస్తున్నారు?
ఇంజినీరింగ్ విద్యలో కృత్రిమ మేధ, ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), రెండు కోర్సులు, కామర్స్లో బిజినెస్ అనలిటిక్స్, దూరవిద్యలో రిటైల్ మేనేజ్మెంట్, ఎన్జీవోస్ మేనేజ్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆంథ్రోపాలజీలో ట్రైబల్ డెవలప్మెంట్లాంటి అనేక కొత్త కోర్సులు తీసుకొస్తున్నాం.
వర్సిటీలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మీ వంతు ఎలా కృషి చేస్తున్నారు.?
వ్యక్తి అయినా విద్యా వ్యవస్థ అయినా పరిస్థితులకు అనుగుణంగా మారుతుండాలి. ఈ క్రమంలోనే ఆన్లైన్ తరగతులను అందిపుచ్చుకుంటున్నాం. త్వరలో ఆడియో వీడియో స్టూడియో నిర్మించబోతున్నాం. గతేడాదిగా సుమారు 40 ఒప్పందాలు చేసుకున్నాం. తాజాగా ఎన్ఐటీతో పాటు విదేశీ సంస్థలతోనూ ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాం. పైగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా’ కింద రూ.47 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
వర్సిటీ భూములు ఆక్రమణకు గురవ్వడంతో సర్వే చేపట్టి నివేదిక ఇచ్చారు. మరి ప్రహరీ ఎప్పుడు కడతారు?
రెవెన్యూ శాఖ సర్వే చేసి నివేదిక అందించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు తీసుకెళ్లా. త్వరలోనే ప్రహరీ కట్టి భూములను కాపాడుకుంటాం. పైగా ఆక్రమణలు కాకుండా ఖాళీ స్థలంలో ఒక మియావాకీ తోటను కూడా పెంచేందుకు మహానగరపాలక సంస్థ ముందుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం