ఆందోళన వద్దు.. సౌకర్యాలు కల్పించాం..
కరోనాతో రెండేళ్లుగా విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేవు. వారు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. అన్ని సౌకర్యాలు కల్పించాం.
న్యూస్టుడే: పరీక్షల ఏర్పాట్లు ఎంత మేరకు వచ్చాయి ? ఎంత మంది పరీక్షలు రాస్తున్నారు?
డీఈవో: జిల్లాలో ఈసారి 3,772 మంది రెగ్యులర్ విద్యార్థులు, ఇద్దరు ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు సమాయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నడపాలని కూడా ఆర్టీసీ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాల మాటేంటి ?
ప్రతి పరీక్ష కేంద్రంలో చల్లటినీరు, ప్యాన్లు, ఫర్నిచర్తో పాటు అనుకోని ఇబ్బందులు ఎదురైతే ప్రాథమిక చికిత్స చేసేలా ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలను అందుబాటులో ఉండే విధంగా కార్యచరణ రూపొందించాం. పరీక్ష కేంద్రాల ప్రాంతంలో పరీక్ష పూర్తి అయ్యే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు బంద్ చేసుకోవాలి.
పరీక్షల నిర్వహణకు ఎంతమందిని ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాలు ఎన్ని ?
జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, మరో డిపార్టుమెంటల్ ఆఫీసర్ను నియమించాం. మొత్తం 215 ఇన్విజిలేటర్లకు బాధ్యతలు అప్పగించాం. జిల్లా వ్యాప్తంగా చీఫ్ సూపరింటెండెంట్లు 20 మంది, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు 20 మందిని నియమించాం. అందరికీ ఉత్తర్వులు జారీచేసి, తగు చర్యలు తీసుకుంటాం.
విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటీ ?
పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులు 45 నిముషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.ఎలాంటి ఆందోళన వద్ధు సిలబస్ కుదించి ఐచ్ఛికాలు పెంచారు. నిశ్చితంగా ప్రశాంతంగా పరీక్షలు రాయండి. మా తరపున అసౌకర్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రానికి వచ్చాక విద్యార్థులు ఏం చేయాలో ఇన్విజిలేటర్లు సూచనలిస్తారు. తొందరపడి ఎలాంటి తప్పులు చేయొద్ధు
ఫీజు చెల్లించకుంటే కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హాల్టికెట్లు ఇవ్వటం లేదని కొందరు విద్యార్థుల తల్లితండ్రులు చెబుతున్నారు. వారి పరిస్థితి ఏంటీ ?
ఇప్పటి వరకు మాకూ అలాంటి ఫిర్యాదులు రాలేదు. ఎవరైనా ఇబ్బందులు పెడితే యాజమాన్యాలతో మాట్లాడి హాల్టికెట్లు ఇప్పిస్తాం. లేదంటే విద్యార్థులు నేరుగా అంతర్జాలం నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైబ్సైట్ని సందర్శించాలి.
సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూ ఏర్పాటు చేశారా ?
అవును. ఏ సమస్య ఉన్నా పరిష్కరించేలా డీఈవో కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. విద్యార్థులు గానీ, వారి తల్లితండ్రులు గానీ 98854 62305 చరవాణి నంబరుకు డయల్ చేస్తే వెంటనే స్పందిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం