తనయులున్నా.. తప్పని భిక్షాటన!
తన జీవితమంతా ధారపోసి కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. ఆస్తి కూడబెట్టారు.. కూతుళ్లకు పెళ్లిచేశారు. కుమారులకు భూమిని పంచారు. ఆ తండ్రి ప్రస్తుతం ఊళ్లోనే భిక్షాటన చేస్తున్న
సింగారంలో భిక్షాటన చేస్తున్న వృద్ధుడు నాగయ్య
బయ్యారం (మహబూబాబాద్), న్యూస్టుడే: తన జీవితమంతా ధారపోసి కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. ఆస్తి కూడబెట్టారు.. కూతుళ్లకు పెళ్లిచేశారు. కుమారులకు భూమిని పంచారు. ఆ తండ్రి ప్రస్తుతం ఊళ్లోనే భిక్షాటన చేస్తున్న దయనీయగాథ ఇది. బయ్యారం మండలం రామచంద్రాపురం పంచాయతీ సింగారం గ్రామానికి చెందిన సూర్నపాక నాగయ్య, ముసలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నాగయ్య కష్టపడి 25 ఎకరాల సాగు భూమిని సంపాదించారు. ముగ్గురు కూతుళ్ల పెళ్లి చేశారు. తన ఇద్దరు కొడుకులు రాందొర, అర్జున్బాబులకు చెరో 10 ఎకరాల సాగు భూమి ఇచ్చారు. నాగయ్య అతని భార్య ముసలమ్మ పోషణ కోసం 5 ఎకరాలు ఉంచుకున్నారు. గత ఏడాది భార్య ముసలమ్మ కొవిడ్తో మృతి చెందారు. ముసలమ్మకు చెందిన బంగారం పంపకాల విషయాల్లో వివాదం నెలకొంది. నాగయ్య జీవనభృతి కోసం కేటాయించిన భూమిని సైతం అతడి ఇద్దరు కుమారులే సాగు చేస్తున్నారు. కొంత పోడు భూమి కావడంతో నాగయ్యకు రైతుబంధు సైతం రావడంలేదు. ముసలమ్మ బంగారం తమకు రావాలని ఆడబిడ్డలు పంచాయితీ పెట్టారు. బ్యాంకులో తనఖా పెట్టడంతో అప్పు చెల్లించి బంగారం తీసుకోవాలని కొడుకులు చెప్పారు. తండ్రి పోషణ కోసం కేటాయించిన భూమిలో కొంత అమ్మి బంగారం విడిపించాలని పెద్దమనుషులు చెప్పినా కుమారులు అంగీకరించలేదు. ఈ వివాదం నేపథ్యంలో నాగయ్య కొడుకుల నుంచి వెళ్లిపోయి అదే గ్రామంలో ఉంటున్న కూతురు ఇంటికి చేరారు. పేదరికంలో ఉన్న కూతురికి తాను భారం కాకూడదని భావించారు. ప్రభుత్వం ఇచ్చే పింఛను సరిపోక భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవడంలేదని నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బ్యాంకులో రూ.4 లక్షల అప్పు కోసం నాలుగు తులాల బంగారం తనఖా పెట్టారని.. అంత సొమ్ము చెల్లించి ఆడబిడ్డలకు బంగారం ఎలా ఇవ్వగలమని నాగయ్య కుమారులు పేర్కొంటున్నారు. పెద్దమనుషులు తమ తీర్పు అంగీకరించలేదంటూ తమను కులబహిష్కరణ చేశారని వారు ఆరోపించారు. ఐదు గ్రామాల పెద్దలను తిరస్కరించడంతో ఆ వివాదాన్ని వారి ఇష్టానికి వదిలేశామని పెద్దమనుషులు పేర్కొంటున్నారు. ఎస్సై రమాదేవిని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా నాగయ్య కుటుంబ ఆస్తి వివాదం తమ దృష్టికి వచ్చిందన్నారు. పెద్ద మనుషుల్లో పరిష్కరించుకుంటామని చెప్పారన్నారు. నాగయ్య సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఆమె తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం