ఆసుపత్రుల్లో మొక్కుబడిగా తనిఖీలు!
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ తంతు మొక్కుబడిగా సాగుతుండడంతో పలు విమర్శలకు తావిస్తోంది.
జనగామలోని ప్రైవేటు ఆసుపత్రిలో వివరాలు తెలుసుకుంటున్న వైద్యాధికారుల బృందం ( పాతచిత్రం)
జనగామ, న్యూస్టుడే: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ తంతు మొక్కుబడిగా సాగుతుండడంతో పలు విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో నిబంధనలు పాటించకున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇరుకు భవనాల్లో నిర్వహణ
జనగామ పట్టణం తర్వాత స్టేషన్ఘన్పూర్లో ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ, మెటర్నిటీ, ఆర్థోపెడిక్, దంత విభాగం, ఆయుష్, ఫిజియోథెరపి తదితర ఆసుపత్రులున్నాయి. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత మరిన్ని కొత్తవి పుట్టుకొచ్చాయి. వీటిలో చాలా వాటికి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఇటీవల తనిఖీలు చేపడుతున్న అధికారులు.. లైసెన్సులు లేని ఆసుపత్రులకు లైసెన్సులు తీసుకోవాలని సూచించి వదిలేస్తున్నారు. పలు దవాఖానాలను గాలి, వెలుతురు సరిగ్గా లేని ఇరుకు భవనాల్లో నిర్వహిస్తున్నారు. జనగామ పట్టణంలో కేవలం రెండు, మూడు ఆసుపత్రులు మాత్రమే 50 పడకలు, విశాలమైన భవనాలు కలిగి ఉన్నాయి.
నిబంధనలకు పాతర
జిల్లా కేంద్రంలోని ఓ మెటర్నిటీ, పిల్లల ఆసుపత్రి నిత్యం వందల సంఖ్యలో బాలింతలు, గర్భిణులు, నవజాత శిశువులతో రద్దీగా ఉంటుంది. భవనం సెల్లార్లోని ఒక విభాగంలో మెటర్నిటీ, మరో విభాగంలో పిల్లల ఓపీ నిర్వహిస్తున్నారు. కాన్పు అయిన మహిళలకు పక్కనే ఉన్న మరో భవనం కేటాయించారు. బాలింతలు పై అంతస్తు భవనంపైకి వెళ్లి వచ్చేందుకు అవస్థలు పడుతున్నారు. ఒకే చోట పిల్లల, మెటర్నిటీ ఆసుపత్రులు నిర్వహిస్తున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పలు దవాఖానాల్లో అగ్నిమాపక శాఖ నిబంధనలు కూడా పాటించడం లేదు. విశాలమైన భవనాలు, పార్కింగ్ స్థలం ఉంటేనే అనుమతులు ఇవ్వాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. చాలా ఆసుపత్రుల్లో అర్హత లేని వైద్యులే ఉన్నారు. ల్యాబ్, మందుల దుకాణాల్లో పని చేసే వారికి సైతం తగిన అర్హతలు ఉండడం లేదు. ఒకరిద్దరు వైద్యాధికారులు.. తమకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల మెప్పు ఉందని ప్రచారం చేసుకుంటూ ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాల నుంచి ముడుపులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అర్హత లేని సిబ్బంది, ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఎవరినీ ఉపేక్షించేది లేదు
- డాక్టర్ మహేందర్, జిల్లా వైద్యాధికారి
జిలా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 30 ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టాం. మరో నాలుగైదు రోజులు కొనసాగుతాయి. ఆసుపత్రులన్నీ నిబంధనలు పాటించాల్సిందే. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించబోం. నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేయడానికి వెనకాడబోం. అన్ని రకాల అనుమతులు కలిగి ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434