‘ఆతిథ్య’మివ్వని గృహం
లేని వనరుల కోసం పడరాని పాట్లు పడే అధికారులు.. కంటి ముందు కనిపించే వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను పట్టించుకోకపోవడంతో ప్రజాధనం వట్టిపోతోంది.
గోవిందరావుపేట(పస్రా), న్యూస్టుడే: లేని వనరుల కోసం పడరాని పాట్లు పడే అధికారులు.. కంటి ముందు కనిపించే వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను పట్టించుకోకపోవడంతో ప్రజాధనం వట్టిపోతోంది. గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని నీటిపారుదలశాఖ అతిథిగృహం ఇందుకు నిదర్శనం. లక్నవరం జలాశయానికి వెళ్లే మార్గంలోని బుస్సాపూర్ గ్రామంలో నీటిపారుదలశాఖ అధికారులు బస చేసేందుకు కొన్ని దశాబ్దాల క్రితమే అతిథిగృహాన్ని నిర్మించారు. అప్పట్లో రవాణా సౌకర్యాలు అంతగా లేనందువల్ల జలాశయం బాగోగులు, నీటి విడుదల ప్రక్రియ పరిశీలించేందుకు వచ్చే అధికారులకు ఉపయోగకరంగా ఉండేది. ఇందులో పెద్ద బావితో పాటు సహాయకులు ఉండేందుకు వీలుగా క్వార్టర్లను సైతం నిర్మించారు. కాలక్రమేణా రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో అతిథిగృహంతో అధికారులకు అంతగా అవసరం లేకపోయింది. నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు భారంగా పరిణమించాయి. దీంతో అతిథిగృహం శిథిలావస్థకు చేరుకుంది.
నిధులు.. సమయం వృథా..
2007లో అప్పటి కలెక్టర్ దమయంతి లక్నవరం జలాశయం సందర్శనకు వచ్చినప్పుడు సుమారు ఎకరం విస్తీర్ణంలో ఉన్న అతిథిగృహాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. అప్పటి వరకు నీటిపారుదలశాఖ అధీనంలో ఉండగా రెవెన్యూశాఖ పరిధిలోకి తీసుకోవాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. వెంటనే మరమ్మతులు చేయించాలంటూ ఐటీడీఏ అధికారులను ఆదేశించి రాష్ట్రీయ సమ వికాస్ యోజన పథకంలో భాగంగా సుమారు రూ. 12 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత కలెక్టర్గా వచ్చిన జనార్దన్రెడ్డి మళ్లీ సుమారు రూ.5 లక్షలు మంజూరు చేశారు. చివరకు అతిథిగృహంలో చిన్న చిన్న పనులు మిగిలిపోయాయి. గుత్తేదారుకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం తదితర కారణాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. సువిశాలమైన ఆవరణలో నర్సరీని సైతం అభివృద్ధి చేసి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని దమయంతి భావించినా ఆమె ఆశయం నెరవేరలేదు. నిధులు వృథా అయ్యాయి.
అభివృద్ధి చేస్తే మేలు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. వాటిల్లో భాగంగా అతిథిగృహం ఆవరణలో నర్సరీని అభివృద్ధి చేయొచ్చు. జలాశయానికి వచ్చే పర్యాటకులు ఈ మార్గంలో అతిథిగృహాలు కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా కూడా అభివృద్ధి చేయొచ్చు. విలువైన ప్రదేశాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం