ఎర్రకోటలో ఓరుగల్లు!
ఓరుగల్లు పతాకం మరోసారి దేశ రాజధాని దిల్లీలో రెపరెపలాడనుంది. ఎర్రకోట కర్తవ్యపథ్ వద్ద జరిగే గణతంత్ర వేడుకల్లో ఉమ్మడి వరంగల్ నుంచి పలువురు తమ ప్రదర్శనల్లో అలరించనున్నారు.
కళ్ల ముందు కదలాడే నృత్యం
న్యూస్టుడే, శివనగర్
ఓరుగల్లు పతాకం మరోసారి దేశ రాజధాని దిల్లీలో రెపరెపలాడనుంది. ఎర్రకోట కర్తవ్యపథ్ వద్ద జరిగే గణతంత్ర వేడుకల్లో ఉమ్మడి వరంగల్ నుంచి పలువురు తమ ప్రదర్శనల్లో అలరించనున్నారు. సాంస్కృతిక, సైనిక విభాగాల్లో జరిగే వేడుకలు, కవాతులో వీరికి అవకాశం దక్కింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని చెప్పడానికి వీరే నిదర్శనం. అకుంఠిత దీక్షతో సాధన చేసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర దేశ ప్రముఖుల ముందు ప్రదర్శనలు ఇచ్చే గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నారు. అదే సమయంలో ఓరుగల్లు కీర్తిని చాటుతున్నారు.
దిల్లీ ఎర్రకోట వేదికగా మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే గొప్ప అవకాశం హనుమకొండకు చెందిన కూచిపూడి నృత్యకారిణి కాట్రగడ్డ హిమాన్సిచౌదరికి దక్కింది. ఉన్నత విద్య పూర్తి చేసినా ఆమె నృత్యాన్ని మరచిపోలేదు. తన లక్ష్యం చేరుకునేందుకు వ్యయప్రయాసలు ఎదుర్కొన్నారు. తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు (వ్యాపారి) ప్రోత్సాహంతో టెంపుల్ డ్యాన్స్ కార్యక్రమాన్ని రూపొందించారు. నిర్జీవమవుతున్న పురాతన ఆలయాలకు జీవం పోసేందుకు నడుం బిగించారు. ఆలయాల వద్ద ప్రదర్శనలు ఇస్తూ వాటిని వెలుగులోకి తెచ్చారు. తాజాగా గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఎర్రకోట కర్తవ్యపథ్లో నిర్వహించే కవాతులో కూచిపూడి శాస్త్రీయనృత్యం సోలో విభాగంలో ఎంపికయ్యారు.
* దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో కూచిపూడి శాస్త్రీయ నృత్యం సోలో విభాగంలో అవకాశం రావడం ఆనందం ఉంది.. మూడు అంచెల వడపోతలో తానొక్కరే ఎంపికైనట్లు హిమాన్సిచౌదరి తెలిపారు.
కవాతులో మనోళ్లు
రంగంపేట, న్యూస్టుడే: ఎర్రకోటలో జరిగే కవాతు (పరేడ్)లో వరంగల్ నగరానికి చెందిన లాల్బహదూర్ కళాశాలకు చెందిన ఎన్సీసీ కెడెట్లు మహేందర్, రాకేష్ పాల్గొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 12 మంది ఎంపికైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేటు నుంచి ఇద్దరు ఓరుగల్లు నగరానికి చెందిన వారున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటి దిల్లీ ఎర్రకోట పరేడ్కు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ, ఎన్సీసీ కెప్టెన్ డాక్టర్ సదానందం తెలిపారు.
సైన్యంలో చేరాలనే లక్ష్యం..
ఈ విద్యార్థి పేరు జి.మహేందర్. డీగ్రీ బీబీఏ చదువుతున్నారు. స్వస్థలం హనుమకొండ నగరం జులైవాడ. తండ్రి చనిపోయారు. పేదరికం వేధిస్తున్నా తల్లి సంరక్షణలో ఎన్సీసీలో అంచెలంచెలుగా ఎదిగారు. సైన్యంలో చేరాలనే లక్ష్యంతో ఎన్సీసీ 10వ తెలంగాణ బెటాలియన్ కెడెట్గా ఎంపికయ్యారు. మూడేళ్లుగా ఎన్సీసీలో ప్రతిభ కనబర్చారు. క్రమశిక్షణ, కఠోరమైన శ్రమతో గణతంత్ర వేడుకల పరేడ్కు ఎంపికయ్యారు.
నీ ఎల్బీ కళాశాల అధ్యాపకులు, ఎన్సీసీ అధికారి సహకారంతో కవాతులో పాల్గొంటున్నానని.. ఇదే స్ఫూర్తితో భారత సైన్యంలో చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని మహేందర్ తెలిపారు.
ఎయిర్ఫోర్స్లో స్థిరపడాలని..
ఈ విద్యార్థి పేరు టి.రాకేష్. డిగ్రీ బీకాం చివరి సంవత్సరం చదువుతున్నారు. స్వస్థలం ఎల్కతుర్తి మండలం కేశపూర్ గ్రామం. పట్టుదల, క్రమశిక్షణతో ఎన్సీసీ 10వ తెలంగాణ బెటాలియన్, 4వ ఎయిర్ వింగ్ బెటాలియన్ కెడెటుగా ఎంపికయ్యారు. ఫ్లయింగ్ లెఫ్టినెంటు బి.ప్రభాకర్ ప్రత్యేక శిక్షణలో ప్రతిభ కనబర్చి రెండు తెలుగు రాష్ట్రాల పోటీని తట్టుకొని గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొంటున్నారు.
* ఎయిర్ ఫోర్స్లో మంచి అధికారిగా స్థిరపడి దేశ సేవ కోసం, దేశరక్షణలో పాల్గొనడమే చిరకాల స్వప్నమని రాకేష్ తెలిపారు.
‘నారీశక్తి’ చాటనున్న కోమల్ ప్రీత్కౌర్
దిల్లీలో శిక్షణలో భాగంగా మహిళా జవాన్లకు సూచనలిస్తున్న సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కోమల్ ప్రీత్కౌర్
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, కాటారం, న్యూస్టుడే: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కోమల్ ప్రీత్కౌర్ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. శకటాల ప్రదర్శనలో సీఆర్పీఎఫ్ ‘నారీశక్తి’ శకటానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
యోగా శిక్షకురాలి నుంచి: హరియాణా రాష్ట్రం ఫతేబాద్ జిల్లా రతియా పట్టణంలో జన్మించిన కోమల్ ప్రీత్కౌర్ చండీగఢ్లో ఎంటెక్ పూర్తి చేశారు. ఆసక్తితో యోగా సాధన చేస్తూనే శిక్షణ ఇచ్చేవారు. 2017లో గ్రూప్-1 హోదా అయిన సీఏపీఎఫ్ అసిస్టెంటు కమాండెంట్ ఉద్యోగం సాధించారు. హరియాణాలోని కాదర్పూర్ సీఆర్పీఎఫ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలోనూ బెస్ట్ ఇన్ ఇండోర్ సాధించారు. 2020లో హనుమకొండ జిల్లా భీమారంలో వరంగల్ 58 బెటాలియన్ హెడ్ క్వార్టర్లో పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత మహాముత్తారం మండలం సీఆర్పీఎఫ్ ఆఫీసర్ కమాండింగ్గా వ్యవహరించారు. గతేడాది 22 ఫిబ్రవరి నుంచి కాటారం, మహాదేవపూర్ ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2021లో మధ్యప్రదేశ్లోని శివ్పూరి కమాండ్ ట్రైనింగ్ సెంటర్లో సీఐఏటీ (కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజమ్) కోర్సు పూర్తి చేశారు. అంకితభావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు.
* కేంద్ర పారా మిలటరీ బలగాల్లో మహిళల పాత్ర, ప్రాధాన్యం తదితర అంశాలను నారీశక్తి శకటంలో ప్రదర్శించనున్నారు. నారీశక్తి శకటం రూపకల్పనలోనూ కోమల్ భాగస్వామ్యం అయ్యారు. కవాతులో దీన్ని ముందుండి నడిపించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434