గణతంత్ర సందేశం.. సంక్షేమ పథం
అందరి భాగస్వామ్యంతో జిల్లా ప్రగతి బాటలో పయనిస్తోందని కలెక్టర్ కె.శశాంక అన్నారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర వేడుకలు జరిగాయి.
ఉత్సాహంగా వేడుకలు
అందరి భాగస్వామ్యంతో జిల్లా ప్రగతి బాటలో పయనిస్తోందని కలెక్టర్ కె.శశాంక అన్నారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ఉదయం 9 గంటలకు కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. స్వాతంత్ర సమరయోధులను సత్కరించారు. అధికారులు, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి జిల్లా ప్రగతి నివేదికను విడుదల చేశారు.
కలెక్టరేట్లో జెండా ఆవిష్కరిస్తున్న పాలనాధికారి శశాంక. చిత్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్: ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 18,398 మందిని పరీక్షించి 3,550 మందికి కంటి అద్దాలు ఇచ్చారు. తొర్రూరు, మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 100 పడకల ఆసుపత్రికి ప్రతిపాదనలు పంపించారు. 139 పల్లె దవఖానాలకు వైద్యాధికారులను నియమించారు. 74 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి.
మన ఊరు-మన బడి: జిల్లాలో 898 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలున్నాయి. మొదటి దశగా 316 బడులను ఈ పథకానికి ఎంపిక చేశాం. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. విద్యార్థుల్లో సామర్థ్యాల, సాధనకు సర్కారు అమలు చేసిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా 1927 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.
రెండు పడక గదుల ఇళ్లు: జిల్లాలో 5,571 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందుకు రూ.295 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 1658 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 896 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు జరిగింది. మిగతావి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
విద్యుత్తు సరఫరా: ప్రస్తుతం ప్రతి రోజూ 3.1 మిలియన్ల విద్యుత్ వినియోగం ఉంది. జిల్లాలో 87,846 వ్యవసాయ బావులుండగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1251 ఉచిత విద్యుత్తు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారు.
వ్యవసాయానికి పెద్దపీట: రైతుబంధు పథకం ద్వారా 1,79,780 మంది రైతులకు ఎకరానికి రూ.ఎకరానికి రూ.5 వేల చొప్పున 2022-23 సంవత్సరం యాసంగిలో రూ. 171.99 కోట్ల నగదును రైతుల బ్యాంకు ఖాతాలో జమచేశారు. 1,37,098 మంది రైతులకు సామూహిక రైతు బీమా చేశారు. ఈ ఏడాది మృతి చెందిన 224కి చెందిన రైతుల కుటుంబ సభ్యుల రూ. 5 లక్షల చొప్పున రూ.11.20 కోట్లు జమ చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి అర్హులైన 90,561 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.54.33 కోట్లు వేశారు. ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఆయిల్పామ్ తోటల విస్తరణ, అభివృద్ధికి రూ.672 లక్షలతో 4250 ఎకరాల లక్ష్యానికి ఇప్పటి వరకు 5564 ఎకరాల విస్తీర్ణాన్ని గుర్తించారు.
ప్రగతి బాటలో పల్లెలు: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఇప్పటి రూ.7 లక్షల విలువ గల ఎరువును విక్రయించారు. గ్రామాలు, శివారు పల్లెల్లో 702 పల్లె పకృతి వనాలు నెలకొల్పారు. 702 క్రీడా ప్రాంగణాలకు 355 నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో తొలిసారిగా నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు సామాజిక సందేశాలను అందించడంతో పాటు ఆహుతులను అలరించాయి. ఆదివాసీ, లంబాడీల సంప్రదాయ నృత్య ప్రదర్శలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకమైన వేషధారణలో చిన్నారులు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. దేశభక్తి, తెలంగాణ సంప్రదాయ నృత్యాలతో ఆకర్శించారు. కలెక్టర్ కె.శశాంక జిల్లా ఎస్పీ శరత్చంద్రపవార్ చిన్నారులకు బహుమతులు అందించి వారిని అభినందించారు. స్వాతంత్ర సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. వేడుకల్లో జడ్పీ అధ్యక్షురాలు ఆంగోత్ బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎస్పీ శరత్చంద్రపవార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఎం.డెవిడ్, శిక్షణ కలెక్టర్ పరమర్ పింకేశ్ కుమార్ లలిత్కుమార్, మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి తదితరులున్నారు.
స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే శంకర్నాయక్
స్వాగతం పలుకుతూ..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?