వైద్య పరిశోధనలకు పెద్దపీట
వైద్య రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఒకప్పుడు వైద్య విద్యార్థులు ఏ ప్రయోగం చేయాలన్నా రోగుల మీదే ఉండేది.
కేఎంసీలో అత్యాధునిక ప్రయోగశాలలు
కేఎంసీ అకడమిక్ బ్లాక్లోని నైపుణ్య కేంద్రం
వైద్య రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఒకప్పుడు వైద్య విద్యార్థులు ఏ ప్రయోగం చేయాలన్నా రోగుల మీదే ఉండేది. మారిన సాంకేతికతతో మొదట వైద్య పరికరాలపై ప్రయోగాలు చేసి పూర్తి శిక్షితులయ్యాకే మనుషులకు చికిత్స చేసే పరిజ్ఞానం వస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థుల నైపుణ్యాలు మరింత పెంపొందించేందుకు వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో మూడు కొత్త ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఈనాడు, వరంగల్, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే
బొమ్మలతో సీపీఆర్పై శిక్షణ
కొన్ని సందర్భాల్లో ఉన్నపళంగా మనుషులు కుప్పకూలిపోతారు. ఇలా సడన్ కార్డియాక్ అరెస్టు సంభవించినప్పుడు సీపీఆర్.. (కార్డియో పల్మనరీ రిసిటేషన్) ఛాతిపై వేగంగా రెండు హస్తాలతో బాదే ప్రక్రియ చేస్తే ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కేఎంసీలోని అకాడమిక్ బ్లాక్లో జాతీయ వైద్య మండలి నిధులతో ఏర్పాటుచేస్తున్న నైపుణ్య కేంద్రం ఇప్పటికే సిద్ధమైంది. ఇందులో కేఎంసీ వైద్య విద్యార్థులకు మనిషి ఆకారంలా ఉండే బొమ్మల (మానికిన్)తో సీపీఆర్పై శిక్షణ ఇవ్వనున్నారు. దీంతోపాటు వైద్యశాలలో రోగులకు చేసే అనేక రకాల చికిత్సలు చేసేందుకు వైద్య పరికరాలపై తర్ఫీదు ఉంటుంది. ఈ ప్రయోగశాల కోసం కావాల్సిన గదులు, సమావేశ మందిరాలు సిద్ధమయ్యాయి. సకల ఆధునిక హంగులతో ఇది ముస్తాబైంది.
ఇతర కళాశాలల వారికి
అకాడమిక్ బ్లాకులోనే మరో ప్రయోగశాల సిద్ధమవుతోంది. నేషనల్ ఎనర్జీ లైఫ్ సపోర్ట్ (ఎన్ఈఎల్ఎస్) పేరుతో కేంద్ర ప్రభుత్వం దీన్ని మంజూరు చేసింది. ఏర్పాటుకు రూ.1.5 కోట్లు మంజూరయ్యాయి. ఇందులోనూ వైద్య విద్యార్థులకు నైపుణ్యాలు పెంచే పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇది ప్రాంతీయ పరిశోధన ప్రయోగశాలగా సేవలు అందించనుంది. ఈ ప్రయోగశాలలో ఇతర కళాశాలల విద్యార్థులకు కూడా నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు వీలుంది. ఈ ప్రయోగశాలతోపాటు ఎన్ఆర్ఐ ఆడిటోరియం వద్ద మరో ల్యాబ్ రానుంది. ఈ ల్యాబ్ ఏర్పాటుకు కేఎంసీ ఎన్ఆర్ఐ పూర్వ విద్యార్థులు రూ.80 లక్షల వరకు విరాళం ఇస్తున్నారు. ప్రతి పీజీ విద్యార్థి పరీక్ష రాసే ముందు ఒక పరిశోధన పత్రం జర్నళ్లలో ప్రచురితం కావాలి. వారు వైద్య రంగంలో కొత్త పరిశోధనలు చేసేందుకు కూడా ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి. ఈ ప్రయోగశాలలు రావడం వల్ల వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఊతమివ్వడమే కాకుండా, కొత్తగా 10 పోస్టులు రానున్నాయి. ఇందులో 5 సైంటిస్టు పోస్టుల వరకు ఉండనున్నాయి. ఈ రెండు ప్రయోగశాలలను త్వరలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతులమీదుగా ప్రారంభించే అవకాశం ఉంది.
ఎంతో ఉపయుక్తం: - డాక్టర్ మోహన్దాస్, ప్రిన్సిపల్, కేఎంసీ
కొత్తగా మూడు ప్రయోగశాలలు కేఎంసీ ఆవరణలో సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అకాడమిక్ బ్లాక్లో స్కిల్ సెంటర్ సిద్ధమైంది. దీన్ని జాతీయ వైద్య మండలి ఏర్పాటుచేస్తోంది. వైద్య పరికరాలు కూడా వచ్చాయి. విద్యార్థులు ఆధునిక వైద్య పరికరాలతో ల్యాబ్లలో కొత్త నైపుణ్యాలు పెంపొందించేందుకు వీలు కలగనుంది. త్వరలో వీటిని ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!