లారీల కొరత తీరుస్తాం..
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని.. లారీల కొరత రాకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి వాజీద్ అలీ అన్నారు.
పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి వాజీద్ అలీ
రైతులతో వీడియో ఫోన్ ఇన్లో మాట్లాడుతున్న వాజీద్ అలీ
ఈనాడు వీడియో కాల్
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేస్తామని.. లారీల కొరత రాకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి వాజీద్ అలీ అన్నారు. మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలపై ‘ఈనాడు’ ఆధ్వర్యంలో వీడియో ఫోన్ఇన్ చేపట్టగా రైతుల నుంచి స్పందన వచ్చింది. దాదాపు 22 మంది రైతులు డీఎస్వోతో మాట్లాడారు. కల్లాల్లో పరిస్థితులను వీడియోలో ఆయనకు ప్రత్యక్షంగా చూపించారు. ప్రధానంగా లారీలు రాక ధాన్యం లోడింగ్ కావడం లేదని రైతులు డీఎస్వోకు వివరించారు. ధాన్యం కేంద్రాల్లో సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని రైతులకు తెలిపారు. వీడియో ఫోన్ఇన్కు వచ్చిన వివరాలు ఇలా..
ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబెట్టాం, గోనె సంచులు ఇవ్వలేదు. పది లోడ్ల ధాన్యం కేంద్రంలో ఉంది.
పోచిరెడ్డి, గుమ్మల్లపల్లి, కాటారం మండలం
జిల్లాకు సరిపోయే గోనె సంచులు ఉన్నాయి. అక్కడి నిర్వాహకులతో మాట్లాడి సంచులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: హమాలీల కొరత ఉంది.. లారీలు రావడం లేదు. 15 నుంచి 20 రోజులుగా ధాన్యాన్ని తరలించడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
లింగమూర్తి, గారెపల్లి, కాటారం మండలం
డీఎస్ఓ: కొనుగోలు కేంద్రాల్లో వాస్తవాలు తెలుసుకునేందుకు ‘ఈనాడు’ వీడియో ఫోన్ఇన్ మాకు మేలు చేసింది. అక్కడి కేంద్రం నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను.
20 రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చాను. నేటికీ కాంటా వేయలేదు. మీరైనా మా బాధను చూడండి.
కూచన రాజమల్లు, జంగేడు, భూపాలపల్లి
అక్కడ ఎందుకు సమస్య తలెత్తిందో తెలుసుకుంటాను. ధాన్యం కాంటా అయ్యేలా చర్యలు తీసుకుంటాం.
పది రోజులుగా ధాన్యం కాంటాలు వేయడం లేదు.. హమాలీల కొరత ఉంది. రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి.
కుమార్, భాస్కర్గడ్డ, భూపాలపల్లి
రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. హమాలీలు, లారీల కొరత తీర్చేలా చర్యలు తీసుకుంటున్నాం. తడిసిన ధాన్యం విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.
తరుగు పేరిట కోతలు విధిస్తున్నారు. రోజుకు ఒక లారీ మాత్రమే లోడ్ అవుతోంది. ఇక్కడ కనీసం 20 లోడ్లకు పైగా బస్తాలున్నాయి.
మహదేవపూర్ రైతులు
మిల్లుల వద్ద దిగుమతి అవడంలో ఆలస్యం అవుతోంది. మరిన్ని లారీలు ఏర్పాటు చేసి ధాన్యం లోడింగ్ అయ్యేలా చూస్తాం. తరుగు పేరిట కోతలు విధిస్తే చర్యలు తీసుకుంటాం.
ఐదు రోజులుగా కాంటాలు కావడం లేదు. రాత్రి వర్షం కురిసింది. లారీలు రావడం లేదు. ధాన్యం కేంద్రంలో పేరుకుపోతోంది. ఇబ్బందిగా ఉంది.
రమేశ్రెడ్డి, రేగులగూడెం, కాటారం
లారీల కొరతను తీర్చేందుకు కలెక్టర్, జేసీలతో మాట్లాడాం. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తాం. ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకుంటాం.
ధాన్యం అమ్మి నెలరోజులవుతోంది. డబ్బులు ఇంకా రాలేదు.
రాములు, కొర్కిశాల, మొగుళ్లపల్లి మండలం
డబ్బులు ఖాతాలో జమయ్యేలా చూస్తాం. ఎక్కడ జాప్యం అవుతుందో తెలుసుకుంటాను.
కాంటాలు వేయడం లేదు.. వర్షం కురిసింది.. మొలకలు వస్తే పెట్టుబడి, శ్రమ వృథా అవుతుంది. రైతుల సమస్యలు పరిష్కరించాలి.
నాగేంద్ర చారి, రంగయ్యపల్లి, రేగొండ మండలం, కిరణ్, పండిగిపల్లి, టేకుమట్ల మండలం
అక్కడి నిర్వాహకులతో మాట్లాడి, ధాన్యం తూకం వేసేలా చూస్తాం.
15 రోజులుగా కేంద్రానికి లారీలు రావడం లేదు. ధాన్యం తరలించాలి.
శంకర్, ధన్సింగ్, శ్రీనివాస్ నిమ్మగూడెం, మహాముత్తారం మండలం
లారీలు పంపించే ఏర్పాటు చేస్తాం. రైతులు ఆందోళన చెందవద్దు.
ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. వర్షం వస్తోంది, పరదాలు కూడా ఇవ్వడం లేదు, ఇబ్బంది కరంగా ఉంది.
శ్రీనివాస్, భావుసింగ్పల్లి, చిట్యాల మండలం, ఉప్పల రవి, చిట్యాల, ఎల్లారెడ్డి, అంబట్పల్లి, మహదేవపూర్
పరదాలు పంపిస్తాం.. రెండ్రోజుల్లో ధాన్యం తరలిస్తాం.
ఆడ, మగ విత్తన వడ్లు సాగు చేశాను. కేంద్రంలో కొనుగోలు చేయడం లేదు.
రమేశ్, ఏలేటి రామయ్యపల్లి, శ్రీనివాస్, నవాబ్పేట, చిట్యాల మండలం
విత్తన వడ్లు కేంద్రంలో కొనుగోలు చేయడం లేదు. విత్తన వడ్లు మిల్లింగ్ చేసే సమయంలో నూకలు అవుతున్నాయని మిల్లర్లు తీసుకోవడం లేదు. వచ్చే ఏడాది చిరు ధాన్యాలు పండించండి. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది.
నాలుగైదు రోజులుగా కాంటాలు కావడం లేదు. ధాన్యం తరలింపులో ఆలస్యం అవుతోంది. మూడురోజులకో లారీ వస్తోంది.
లక్ష్మణ్, దినేశ్, విలాసాగర్, కాటారం మండలం, నరేందర్, బొమ్మాపూర్, మహదేవపూర్
లారీలు వచ్చేలా చూస్తాం, అక్కడి నిర్వాహకులతో మాట్లాడుతాం. ధాన్యం తరలింపును వేగవంతం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?